Himanta Biswa Sarma: బాల్య వివాహాల నిర్మూలనే మా లక్ష్యం
- అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బాల్య వివాహాలు అరికట్టేందుకు నిజుత్ మొయినా పథకానికి కేబినేట్ ఆమోదం..
- అమ్మాయిల భవిష్యత్ కోసం ఈ పథకం: అసోం సీఎం హిమంత బిస్వా శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బాల్య వివాహాలు అరికట్టేందుకు నిజుత్ మొయినా పథకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు రాష్ట్రంలోని బాలికలను ప్రభుత్వమే చదివించబోతుంది. దీనికోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ప్రభుత్వం ప్రతి నెలా విద్యార్థినీల ఖాతాల్లో రూ.1000 జమ చేయబోతుందన్నారు. డిగ్రీలో చేరినవారికి రూ.1,250, పీజీ (పోస్టు గ్రాడ్యుయేషన్) చేసే వారికి రూ.2,500 ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇక, వేసవి సెలవుల్లో మాత్రం ప్రభుత్వం నుంచి స్టైఫండ్ రాదన్నారు. ఏడాదిలో పది నెలల పాటు విద్యార్థినీల ఖాతాల్లోకి డబ్బు జమ కానుంది అన్నమాట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కుమార్తెలు, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినీలు మినహా అందరూ ఈ పథకానికి అర్హులే అని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.
Read Also: Mega Family: పవన్ కోసం కదిలొచ్చిన మెగా కుటుంబం (Video)
Also Read
అలాగే, బాల్య వివాహాలు నిర్మూలించడంతో పాటు అమ్మాయిల బంగారు భవిష్యత్ కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. ప్రతినెలా 11న విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేస్తామన్నారు. పీజీ కోర్సుల్లో చేరిన పెళ్లైన యువతులకు మినహాయింపు ఉంటుందన్నారు. అలాగే, ఈ పథకం వల్ల తల్లిదండ్రులపై భారం చాలా వరకు తగ్గుతుందన్నారు. తమ కుమార్తెలను కాలేజీలకు, యూనివర్సిటీలకు పంపేందుకు అవకాశం ఉందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!