ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా మరికాసేపట్లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ జాకీర్ అలీ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్కు బదులు జకీర్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. భారత్ మ్యాచ్ కోసం బంగ్లా తుది జట్టులో నాలుగు మార్పులు చేసినట్లు చెప్పాడు. మరోవైపు భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. సూపర్ 4లో చిరకాల ప్రత్యర్థి…
ఆసియా కప్ 2025లో భాగంగా ఈరోజు రాత్రి బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా ఫైనల్ చేరుకుంటుంది. మ్యాచ్ నేపథ్యంలో ప్లేయింగ్ 11పై అందరిలో ఆసక్తి నెలకొంది. పాకిస్థాన్ మ్యాచ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేదు. దాంతో బంగ్లా మ్యాచ్లో టీమ్ మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతిని ఇస్తుందని అందరూ భావించారు. అయితే ఆసియా కప్ 2025లోని మిగతా మ్యాచ్లకు బుమ్రా అందుబాటులో ఉంటాడని టీమిండియా సహాయక కోచ్ రైన్ టెన్…
IND vs BAN: పాకిస్తాన్పై భారీ విజయాన్ని సాధించిన భారత్.. ఆసియా కప్ 2025 సూపర్ 4లో తన తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో నేడు (సెప్టెంబర్ 24) తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో స్పిన్నర్ల పాత్ర కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య జరిగిన 17 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించగలిగింది. గణాంకాల…
టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబె సేవల్ని గత కెప్టెన్ల కంటే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాగా ఉపయోగించుకుంటున్నాడని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దూబెలోని బౌలర్ను సూర్య చక్కగా ఉపయోగించుకోవడం వల్లే దాయాది పాకిస్థాన్పై విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు బాగా బౌలింగ్ చేస్తున్నారని వీరూ ప్రశంసించాడు. ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది.…
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో పాకిస్థాన్ బౌలర్లు సత్తాచాటారు. షాహీన్ అఫ్రిది 3, హుస్సేన్ తలత్ 2 వికెట్స్ తీయడంతో లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 రన్స్ మాత్రమే చేసింది. కమిండు మెండిస్ (50; 44 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో చమిక కరుణరత్నే (17), వానిండు హసరంగా (15) రాణించడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేసింది.…
Pakistan vs Sri Lanka: 2025 ఆసియా కప్లో పాకిస్థాన్ నేడు శ్రీలంకతో తలపడుతుంది. ఇది పాకిస్థాన్కు డూ-ఆర్-డై మ్యాచ్. ఈరోజు పాకిస్థాన్ ఓడిపోతే, ఫైనల్కు చేరుకోవాలనే ఆశలు అడియాశలుగా మారిపోతాయి. శ్రీలంక కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు జట్లు తమ తొలి సూపర్ ఫోర్ మ్యాచ్లో పరాజయాలను చవిచూశాయి. శ్రీలంక తన తొలి సూపర్ ఫోర్ మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, పాకిస్థాన్ తన సూపర్ ఫోర్ ఓపెనర్లో…
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్లు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. లీగ్ దశ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం పెను దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాకిస్థాన్ ఆటగాళ్లతో సహా మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా దాయాది దేశాలు గ్రూప్-4లో తలపడగా.. పలుసార్లు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాక్ సీనియర్ పేసర్ హారిస్ రవూఫ్ ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్థాన్ పేసర్ హారిస్…
ఆసియా కప్ 2025కు ముందు ఆరు నెలల పాటు టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితం అయ్యాడు. అన్ని సిరీస్లకు ఎంపికయినా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే, టీ20 సిరీస్లలో కుల్దీప్ కేవలం రెండే వన్డేలు మాత్రమే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సత్తాచాటినా.. ఇంగ్లండ్తో అయిదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025లో అవకాశం…
Pakistan: ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ‘6-0’ సంజ్ఞపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, తాము 6 భారత విమానాలను కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిపై అక్కడి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించింది. తమ ఎయిర్ బేస్లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని కూడా…
ఆసియా కప్ 2025లో భారత్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్లపై అద్భుతమైన విజయాలు సాధించిన భారత్.. సూపర్-4లో కూడా ఆధిపత్యాన్ని చూపుతోంది. సూపర్-4లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మరోసారి జయకేతనం ఎగురవేసింది. సూపర్-4లో భారత్ ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే.. ఫైనల్ బెర్త్ దక్కనుంది. ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్లో టీమిండియా కోచ్ గౌతమ్…