Haris Rauf: హారిస్ రవూఫ్కు మద్దతు.. పాకిస్థాన్ మహిళా ప్లేయర్స్ సైతం కవ్వింపులు!
- వివాదాలకు దారితీస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్లు
- హారిస్ రవూఫ్ ఘటన సోషల్ మీడియాలో దుమారం
- పాకిస్థాన్ మహిళా ప్లేయర్స్ సైతం కవ్వింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్లు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. లీగ్ దశ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం పెను దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాకిస్థాన్ ఆటగాళ్లతో సహా మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా దాయాది దేశాలు గ్రూప్-4లో తలపడగా.. పలుసార్లు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాక్ సీనియర్ పేసర్ హారిస్ రవూఫ్ ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. భారత అభిమానులు ‘కోహ్లీ, కోహ్లీ’ అంటూ అరిచారు. దీంతో హారిస్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అభిమానుల వైపు తిరిగి.. తన చేతితో ‘6-0’ అంటూ సైగలు చేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన 6 ఫైటర్ జెట్లను పాక్ కూల్చివేసినట్లు సైగలు చేశాడు. ఇప్పటివరకు 6 జెట్ ఫ్లైట్స్కు సంబంధించిన ఆధారాలను బయటపెట్టలేదు కానీ.. అదే నిజమని పాక్ క్రికెటర్లు నమ్ముతున్నారు. అందులో భాగంగానే హారిస్ కావాలనే అలా సైగలు చేశాడు.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
Also Read: Samsung Discounts: శాంసంగ్ బిగ్ సేల్.. అదనపు టీవీ, ఉచిత సౌండ్బార్ మీ సొంతం!
హారిస్ రవూఫ్ తీరుపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయితే పాకిస్థాన్ నుంచి మాత్రం అతడికి రోజురోజుకు మద్దతు పెరగుతోంది. హరీస్ సతీమణి ముజ్నా మసూద్ మాలిక్ పెట్టిన పోస్ట్ ఆగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. హరీస్ 6-0 సంజ్ఞను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘మ్యాచ్ ఓడినా యుద్దం గెలిచాం’ అని క్యాప్షన్గా పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్ మహిళా ప్లేయర్స్ సైతం కవ్వింపులకు దిగుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో నష్రా సంధు, సిద్ర అమిన్లు 6-0 సంజ్ఞ చేశారు. పాక్ ప్రభుత్వం ఆదేశాల మేరకే ఇద్దరు మహిళా ప్లేయర్స్ ఈ సంజ్ఞ చేసినట్లు తెలుస్తోంది. నష్రా, సిద్ర తీరుపై భారత ఫాన్స్ మండిపడుతున్నారు. ‘మీకు ఇదేం పోయేకాలం’ అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
🇵🇰 Nashra Sandhu picked her career best 26/6 last night.
• Previous Match Sidra Amin scored her 6th 100. 🙌
Meanwhile Indians crying on celebration. pic.twitter.com/wvezFMYEMe
— Nawaz. (@Rnawaz0) September 23, 2025
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!