Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం మరోసారి పెద్ద ఆరోపణ చేశారు. తీహార్ జైలు పరిపాలన బీజేపీ ఆదేశాల మేరకు నడుస్తోందన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్పై వేటు పడింది.
మద్యం కుంభకోణంలో తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ క్రమంలో.. మంగళవారం కేజ్రీవాల్ భార్య సునీత తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ను కలిశారు. కేజ్రీవాల్ తన భార్య ద్వారా మరోసారి సందేశం పంపారు. ముఖ్యమంత్రి రెండు సందేశాలపై మంత్రి గోపాల్ రాయ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ మాకు రెండు సందేశాలు అందించారని ఆప్ నేత పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారన్నది కోర్టు ముందు కేజ్రీవాల్ వాదన వినిపించారు. అనంతరం.. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్పై అత్యవసరంగా విచారించాలంటూ బుధవారం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఉగాది రోజున హైకోర్టు విచారించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ మధ్యాహ్నం 2.30 గంటలకు కేసును విచారించనున్నారు. ఏప్రిల్ 3న ఈడీ.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసులో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేడు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆప్ ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మేదినీపూర్ జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బృందంపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఆ బృందం అర్ధరాత్రి తర్వాత దాడులకు ఎందుకు వచ్చిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. వేళకాని సమయాల్లో దాడులు చేయడానికి అవసరమైన అనుమతి బృందానికి ఉందా అని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. “అర్ధరాత్రి వారు ఎందుకు దాడి చేశారు..? వారు పోలీసుల నుండి అనుమతి తీసుకున్నారా..? అర్ధరాత్రి ఎవరైనా అపరిచితుడు ఆ ప్రదేశానికి వస్తే స్థానికులు…