Sanjay Singh : బీజేపీ ఆదేశాల మేరకే తీహార్ జైలు పరిపాలన.. ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం మరోసారి పెద్ద ఆరోపణ చేశారు. తీహార్ జైలు పరిపాలన బీజేపీ ఆదేశాల మేరకు నడుస్తోందన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కలిసేందుకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్కు మాత్రమే అనుమతి ఉంది. సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తనను కలవడానికి అప్లై చేసినప్పుడు, మీరు తనను ముఖాముఖి కాకుండా కిటికీ ద్వారా కలవవచ్చని ఆమెకు చెప్పారు. ఒక రాష్ట్రానికి సీఎం భార్య పట్ల ఇంత అమానుషంగా ఎందుకు వ్యవహరించారు? ఇది అమానుష చర్యగా ఆయన అభివర్ణించారు. భయంకరమైన నేరస్థులను కూడా బ్యారక్లో కలవడానికి అనుమతిస్తారు. అయితే ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన భార్యను కిటికీలోంచి కలుసుకోవడానికి అనుమతించబడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also:Kavitha: కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. వాట్సప్ చాట్పై ప్రశ్నించే ఛాన్స్
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
#WATCH | AAP MP Sanjay Singh says, "When the wife of Arvind Kejriwal applied to meet him, she was told that you cannot meet him face-to-face but through a window. Why such inhuman behaviour… This inhuman act has been done just to humiliate and discourage the CM. I am saying… pic.twitter.com/J0iZimH3pw
— ANI (@ANI) April 13, 2024
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుమారు ఆరు నెలల పాటు జైలులో ఉన్న సంజయ్ సింగ్ 2024 ఏప్రిల్ 3న బెయిల్పై విడుదలయ్యాడు. అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా, సత్యేంద్ర జైన్ భార్య పూనాజ్ జైన్లను ఆయన మొదట కలిశారు. తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన బీజేపీపై మరింత దూకుడుగా కనిపించడం మొదలుపెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ సభ ఎన్నికల కార్యక్రమాల్లో చురుగ్గా మారారు. ఏప్రిల్ 9న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను కూడా కలిశారు.
Read Also:RJD Manifesto : 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కోటి ఉద్యోగాలు.. ఆర్జేడీ మేనిఫెస్టో ఇదే
శుక్రవారం (ఏప్రిల్ 12) యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆప్ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా నిర్వహించిన మెగా ర్యాలీలో పాల్గొని నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాకు మద్దతుగా నిలిచారని అన్నారు. అన్యాయం, అణచివేత, అవినీతితో నిండిన బీజేపీని నిర్మూలించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త మీకు భుజం భుజం కలిపి మద్దతు ఇస్తారని ప్రకటించారు.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?