Supreme Court: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ స్వీకరణ.. విచారణ ఎప్పుడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. తన అరెస్ట్పై అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. త్వరలో ఓ తేదీని చెబుతామని సూచించింది. తాజాగా కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు స్వీకరించింది. సోమవారం (15-04-2024) పిటిషన్ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జస్టిస్లు సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ను విచారించనున్నారు.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఏప్రిల్ 15న సుప్రీంకోర్టులో విచారణ
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ముందుగా కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ పిటిషన్ను తిరస్కరించింది. ఈ సందర్భంగా హైకోర్టు.. కేజ్రీవాల్పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయని తెలిపింది. ముఖ్యమంత్రికి ఒకలా.. మరొకరికి ఇంకోలా చట్టం ఉండదని.. చట్టం అందరికీ సమానం అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: Kavitha: కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. వాట్సప్ చాట్పై ప్రశ్నించే ఛాన్స్
మార్చి 21న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రెండు సార్లు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా కేజ్రీవాల్కు ఏప్రిల్ 15 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ఆయన జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. రాజీనామా చేసేలా ఆదేశించాలని పలువురు కోర్టుకెళ్లినా… న్యాయస్థానం పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. మరీ ఏప్రిల్ 15న కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందా? లేదంటే వాయిదా వేస్తుందా వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Sanjay Singh : బీజేపీ ఆదేశాల మేరకే తీహార్ జైలు పరిపాలన.. ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?