Kejriwal: కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీపై వేటు.. కారణమిదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్పై వేటు పడింది. ఆయన్ను విజిలెన్స్ డిపార్ట్మెంట్ తొలగించింది. ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి సంబంధించిన కేసు కారణంగా బిభవ్కుమార్ను డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ తొలగించింది. ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిభవ్ కుమార్ను ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అతనితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ను కూడా వేర్వేరుగా ఈడీ విచారించింది.
ఇది కూడా చదవండి: Sanju Samson: ఓటమి తర్వాత.. అందుకు కారణాలు చెప్పడం చాలా కష్టం: సంజూ
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
2011లో అవినీతికి వ్యతికేరంగా చేపట్టిన ఉద్యమం నుంచి ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో బిభవ్కుమార్కు మంచి సంబంధాలు ఉన్నాయి. యూపీఏ హయాంలో వెలుగులోకి వచ్చిన అవినీతి కుంభకోణాలపై బిభవ్ పోరాటం చేశారు. అనంతరం ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. పర్సనల్ సెక్రటరీగా బిభివ్ను కేజ్రీవాల్ నియమించకున్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. మార్చి 21న ఆయన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Chandrababu and Pawan Kalyan: చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం.. నేడు అమలాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు
అనంతరం ఈడీ అరెస్ట్పై హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈడీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని.. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవని స్పష్టం చేసింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పు వెలువరించారు. దీంతో కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలను కూడా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ సుప్రీంకోర్టు కూడా విచారణకు మరొక తేదీని ఇస్తామని పెండింగ్లో పెట్టింది.
ఇది కూడా చదవండి: Pakistan: పాక్ సైన్యం దురాగతాలు.. పోలీస్ స్టేషన్పై దాడి చేసి..!
ఇక బుధవారం సునీతా కేజ్రీవాల్ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్, ఆప్ సభ్యులు సందీప్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్లతో సహా ప్రముఖ ఆప్ నేతలు కలిశారు. నియంత ప్రభుత్వం యొక్క అన్ని దురాగతాలను భరించడానికి కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని సునీతా కేజ్రీవాల్ సందేశాన్ని వినిపించారు.
ఇది కూడా చదవండి: Summer Tips : వేసవిలో ఈ పానీయాలను తాగితే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!