Arvind Kejriwal-Pushpa 2: పుష్ప-2 అవతారంలో అరవింద్ కేజ్రీవాల్.. తగ్గేదేలే?
- త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
- బీజేపీ, ఆప్ మధ్య మరోసారి పోస్టర్ వార్
- పుష్ప-2 అవతారంలో అరవింద్ కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది. ఈ రాజకీయ పోరులో ఇరు రాజకీయ పార్టీల నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ తన పోస్టర్లలో ‘ఆప్’ కుంభకోణాలను బయటపెట్టడంలో బిజీగా ఉంది. అదే సమయంలో ఆప్ కూడా ‘పుష్ప’ తరహాలో బీజేపీపై విరుచుకుపడింది.
READ MORE: Hyderabad Air Show: నేడు ట్యాంక్బండ్పై ఎయిర్ షో.. ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఆప్ ప్రభుత్వ మోసాలను ప్రస్తావిస్తూ బీజేపీ శనివారం పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఫోటో కూడా ఉంది. మద్యం, మొహల్లా క్లినిక్, హవాలా, సెక్యూరిటీ, రేషన్, పానిక్ బటన్, షీష్మహల్, మెడిసిన్, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్రూమ్, సీసీటీవీ స్కామ్లతో పాటు ‘కేజ్రీవాల్ స్కామ్ల వెబ్’ అని క్యాప్షన్ పెట్టింది.
READ MORE:Pushpa 2 : పుష్ప-2 టికెట్ రేట్ అందరికి అందుబాటులో ఉంటుంది : మైత్రీ నిర్మాతలు
దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన పోస్టర్లలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్రంలోని అధికార బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది. ఆప్ విడుదల చేసిన పోస్టర్లో అరవింద్ కేజ్రీవాల్కు చీపురు చూపించి ‘ఫిర్ ఆ రహా హై కేజ్రీవాల్’ అని ‘పుష్ప’ స్టైల్లో ఫోజ్ ఇస్తూ కనిపించాడు. అంటే అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ అధికారంలోకి రానున్నారనే అర్థం వచ్చేలా పేర్కొన్నారు. ఈ ఫోటోపై ‘కేజ్రీవాల్ తలవంచడు'(తగ్గేదేలే) అని ఉంది. కేజ్రీవాల్ 4 వ సారి అధికారంలోకి వస్తారని పేర్కొన్నారు.
READ MORE:Akshara Gowda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మాస్ కా దాస్ హీరోయిన్
ఇదిలా ఉంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. అలాగే బీజేపీ కూడా నియోజకవర్గ కమిటీలను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆప్తో పొత్తు ఉండబోదని తెలిపింది. మొత్తానికి ఢిల్లీలో త్రిముఖ పోరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!