Arvind Kejriwal: కాంగ్రెస్తో వద్దు.. మేం ఒంటరిగానే పోటీ చేస్తాం..
- ఆప్- కాంగ్రెస్ల మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయని ప్రచారం..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం..
- ఎన్నికల్లో సొంత బలంతోనే పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్..
Arvind Kejriwal: వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్కు 15 స్థానాలు, ఇండియా బ్లాక్ లోని మిగతా పార్టీలకు 1-2 స్థానాలను ఆప్ కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేజ్రీవాల్ తోసిపుచ్చారు. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సొంత బలంతోనే ముందుకు వెళ్లనుందని ఆప్ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
Read Also: Aqua Farmers: ఆక్వా రైతుల దారుణం.. కార్యకర్తను స్తంభానికి కట్టి..!
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
ఇక, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోందని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన అభ్యర్థులతో కూడిన రెండు జాబితాను రిలీజ్ చేశారు. రెండు విడతల్లో 31 మంది అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఆప్ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కేజ్రీవాల్.. ప్రజలు మళ్లీ తనకు విశ్వసనీయత సర్టిఫికెట్ ఇచ్చే వరకూ ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి, రాబోయే ఎన్నికల కోసం పార్టీని ముందుకు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆప్ సీనియర్ నేత ఆతిషి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Read Also: Funky : మాస్ కా దాస్ విశ్వక్ కొత్త సినిమా టైటిల్ ఏంటంటే ?
అయితే, ఈ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి బంగ్లా వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తనను తాను సామాన్యుడిగా చెప్పే కేజ్రీవాల్.. అధికారంలో ఉన్నప్పుడు.. రూ.కోట్లు ఖర్చు పెట్టి సీఎం నివాసానికి మార్పులు చేశారని బీజేపీ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది. ప్రజాధనం ఉపయోగించి కేజ్రీవాల్ ఇంధ్ర భవనాన్ని కట్టుకున్నారని మండిపడింది. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతే.. బీజేపీ మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతుందని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 11, 2024
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!