Arvind Kejriwal: కాంగ్రెస్తో వద్దు.. మేం ఒంటరిగానే పోటీ చేస్తాం..
- ఆప్- కాంగ్రెస్ల మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయని ప్రచారం..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం..
- ఎన్నికల్లో సొంత బలంతోనే పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్కు 15 స్థానాలు, ఇండియా బ్లాక్ లోని మిగతా పార్టీలకు 1-2 స్థానాలను ఆప్ కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేజ్రీవాల్ తోసిపుచ్చారు. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సొంత బలంతోనే ముందుకు వెళ్లనుందని ఆప్ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
Read Also: Aqua Farmers: ఆక్వా రైతుల దారుణం.. కార్యకర్తను స్తంభానికి కట్టి..!
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
ఇక, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోందని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన అభ్యర్థులతో కూడిన రెండు జాబితాను రిలీజ్ చేశారు. రెండు విడతల్లో 31 మంది అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఆప్ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కేజ్రీవాల్.. ప్రజలు మళ్లీ తనకు విశ్వసనీయత సర్టిఫికెట్ ఇచ్చే వరకూ ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి, రాబోయే ఎన్నికల కోసం పార్టీని ముందుకు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆప్ సీనియర్ నేత ఆతిషి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Read Also: Funky : మాస్ కా దాస్ విశ్వక్ కొత్త సినిమా టైటిల్ ఏంటంటే ?
అయితే, ఈ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి బంగ్లా వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తనను తాను సామాన్యుడిగా చెప్పే కేజ్రీవాల్.. అధికారంలో ఉన్నప్పుడు.. రూ.కోట్లు ఖర్చు పెట్టి సీఎం నివాసానికి మార్పులు చేశారని బీజేపీ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది. ప్రజాధనం ఉపయోగించి కేజ్రీవాల్ ఇంధ్ర భవనాన్ని కట్టుకున్నారని మండిపడింది. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతే.. బీజేపీ మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతుందని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 11, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!