Kejriwal: కేజ్రీవాల్కు ప్రభుత్వ క్వార్టర్ కేటాయింపుపై కేంద్రం కీలక ప్రకటన
- కేజ్రీవాల్కు ప్రభుత్వ క్వార్టర్ కేటాయింపుపై కేంద్రం కీలక ప్రకటన
- త్వరలోనే ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తామని కేంద్రమంత్రి ఖట్టర్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో ప్రభుత్వ క్వార్టర్ కేటాయిస్తామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల బంగ్లాలు నిండిపోయి ఉన్నాయని చెప్పారు. అందుబాటులోకి రాగానే కేజ్రీవాల్కు వసతి కల్పిస్తామని చెప్పారు. జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్ అర్హులని వెల్లడించారు. ప్రస్తుతం ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో కేజ్రీవాల్ నివాసం ఉంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ జైలు కెళ్లారు. దాదాపు 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి ఇంటికి చేరుకున్నాక.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి సీటులో అతిషిని కూర్చోబెట్టారు. అనంతరం కేజ్రీవాల్ ఖాళీ చేసిన నివాసంలోకి అతిషి మకాం మార్చారు. వాస్తవానికి జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్కు ప్రభుత్వ బంగ్లాను కేటాయించాల్సి ఉంటుంది. కానీ అప్పుడు కేటాయించలేదు. దీంతో కేజ్రీవాల్.. పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లోకి మారిపోయారు. తాజాగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ.. జాతీయ పార్టీ అధినేత కేజ్రీవాల్ అర్హులని.. త్వరలోనే ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం తెలిపారు.
Also Read
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్కు బంగ్లా కేటాయించాలని కేంద్రానికి ఆప్ లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖకు లేఖ పంపింది. అయితే తాజాగా మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ.. ప్రస్తుతం తమ దగ్గర V మరియు VI రకం బంగ్లాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. VII రకం బంగ్లాలు అందుబాటులో లేవని తెలిపారు. VII రకం బంగ్లాలు అందుబాటులోకి రాగానే కేటాయిస్తామని ఖట్టర్ తెలిపారు.
ఇదిలా ఉంటే వచ్చే నెలలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఆప్ ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 11 మంది, రెండో విడతలో 20 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా కసరత్తు ప్రారంభించాయి. ఈసారి ఢిల్లీలో త్రిముఖ పోటీ నెలకొంది. హస్తిన వాసులు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!