Kejriwal: కేజ్రీవాల్కు ప్రభుత్వ క్వార్టర్ కేటాయింపుపై కేంద్రం కీలక ప్రకటన
- కేజ్రీవాల్కు ప్రభుత్వ క్వార్టర్ కేటాయింపుపై కేంద్రం కీలక ప్రకటన
- త్వరలోనే ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తామని కేంద్రమంత్రి ఖట్టర్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో ప్రభుత్వ క్వార్టర్ కేటాయిస్తామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల బంగ్లాలు నిండిపోయి ఉన్నాయని చెప్పారు. అందుబాటులోకి రాగానే కేజ్రీవాల్కు వసతి కల్పిస్తామని చెప్పారు. జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్ అర్హులని వెల్లడించారు. ప్రస్తుతం ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో కేజ్రీవాల్ నివాసం ఉంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ జైలు కెళ్లారు. దాదాపు 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి ఇంటికి చేరుకున్నాక.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి సీటులో అతిషిని కూర్చోబెట్టారు. అనంతరం కేజ్రీవాల్ ఖాళీ చేసిన నివాసంలోకి అతిషి మకాం మార్చారు. వాస్తవానికి జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్కు ప్రభుత్వ బంగ్లాను కేటాయించాల్సి ఉంటుంది. కానీ అప్పుడు కేటాయించలేదు. దీంతో కేజ్రీవాల్.. పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లోకి మారిపోయారు. తాజాగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ.. జాతీయ పార్టీ అధినేత కేజ్రీవాల్ అర్హులని.. త్వరలోనే ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం తెలిపారు.
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్కు బంగ్లా కేటాయించాలని కేంద్రానికి ఆప్ లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖకు లేఖ పంపింది. అయితే తాజాగా మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ.. ప్రస్తుతం తమ దగ్గర V మరియు VI రకం బంగ్లాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. VII రకం బంగ్లాలు అందుబాటులో లేవని తెలిపారు. VII రకం బంగ్లాలు అందుబాటులోకి రాగానే కేటాయిస్తామని ఖట్టర్ తెలిపారు.
ఇదిలా ఉంటే వచ్చే నెలలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఆప్ ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 11 మంది, రెండో విడతలో 20 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా కసరత్తు ప్రారంభించాయి. ఈసారి ఢిల్లీలో త్రిముఖ పోటీ నెలకొంది. హస్తిన వాసులు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి.
తాజావార్తలు
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!