హైదరాబాద్లో మోస్ట్వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ అయ్యాడు. హత్యాయత్నం కేసులో మొయినాబాద్ పోలీసులకు చిక్కాడు క్రిమినల్ సయ్యద్ బుర్హానుద్దీన్.. అతని వద్ద నుంచి బెంజ్ కారు, క్రికెట్ బ్యాట్, ఐరన్ రాడ్, 25 హాకీ స్టిక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Ganja Smuggling: హైదరాబాద్ కొండాపూర్ లోని ఓయో రూమ్ లో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని కావలికు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన సంజనగా గుర్తించారు పొలిసు అధికారులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు గత కొంతకాలంగా ఆరుకు ప్రాంతాల నుండి గంజాయి తీసుకువచ్చి, ఓయో రూమ్ లో ఉంటూ విక్రయాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు, వారి…
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తురక కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తురక కిషర్ను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం తురక కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లారు.
హైదరాబాద్ నగరంలో వాహనదారులను లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇద్దరు కిలాడీ లేడీలు.. ఆ మహిళలను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్గూడకు చెందిన వెన్నెల బంధువులు. గత కొంతకాలంగా వీరు వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
Daggubati Purandeswari : టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2’ చిత్రం విడుదల నేపథ్యంలో, థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్ళిన అల్లుఅర్జున్పై జరిగిన ఘటన గురించి బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్ను అరెస్టు చేయడం సరైనదే కాదని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీన అరెస్టు…
Vietnam Hanoi: వియత్నాం రాజధాని హనోయిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వియత్నాం పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ గురువారం ఈ ఘటనను ధృవీకరించింది. మూడు అంతస్తుల కేఫ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేఫ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉద్యోగులతో గొడవపడి, పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షతోనే ఈ పని చేశానని నిందితుడు అంగీకరించాడని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం తర్వాత ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్…
హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. నాగబాబు ఇంటికి తన భార్య స్నేహారెడ్డితో కలిసి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్ట్ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. అంతకు ముందు అల్లు అర్జున్ సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.
అసోం రాజధాని గౌహతిలోని ఓ ఆలయంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన బాలిక వివరాలు తెలియలేదని శనివారం పోలీసులు తెలిపారు. నవంబర్ 17న రాస్ మహోత్సవం సందర్భంగా దుర్గ గుడి ఆవరణలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పేర్కొన్నారు.
Lady Don : మోస్ట్ వాండెడ్ గంజాయి డాన్ అంగూర్ బాయి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఆపరేషన్ ధూల్పేట్ కింద కార్వాన్లో ఎక్సైజ్ పోలీసు బృందం అంగూర్ బాయ్ను అరెస్టు చేసింది. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ధూల్పేట్లో గంజాయి డాన్గా పేరున్న అంగూర్ బాయి పది కేసులలో నిందితురాలిగా ఉన్నట్లు చెప్పారు. కొంతకాలం ఆమె పోలీసుల చేతిలో చిక్కకుండా పరారీలో ఉన్నట్లు చెప్పారు. అంగూర్ బాయిపై గంజాయి అమ్మకాలకు సంబంధించి 3…
వన్ సైడ్ లవ్.. అది ఫలించకపోవడంతో తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదని కక్ష పెంచుకున్నాడు ఆ ప్రేమోన్మాది. తన ప్రేమను నిరాకరించిందని మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా కత్తితో 13 సార్లు పొడిచాడు. గాయాలతో రక్తపు మడుగులో జీవచ్ఛవంలా ఆ యువతి పడిపోవడంతో ఆమె చనిపోయింది అనుకున్న ఆ యువకుడు అక్కడి నుండి పారిపోయాడు.