Daggubati Purandeswari : కేంద్రం జమిలిపై జేపీసీని నియమించింది..
- అల్లు అర్జున్ ఆ సినిమా హీరో కాబట్టే ఆరోజు ధియేటర్ దగ్గరకు వచ్చారు
- ఆయన ప్రేరేపిస్తే జరిగిన ఘటన కాదది
- కేంద్రం జమిలిపై జేపీసీని నియమించింది
- అందరి అభిప్రాయాలను జేపీసీ సేకరించి పార్లమెంట్ ఉభయ సభల ముందు ఉంచుతుంది :దగ్గుబాటి పురందేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari : టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2’ చిత్రం విడుదల నేపథ్యంలో, థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్ళిన అల్లుఅర్జున్పై జరిగిన ఘటన గురించి బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్ను అరెస్టు చేయడం సరైనదే కాదని వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీన అరెస్టు చేశారు. ‘పుష్పా-2’ సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ చుట్టూ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలకలం రేపింది. ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు, అందులో సంధ్యా థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ కూడా ఉన్నారు. పోలీసులు ఈ ముగ్గురిని రిమాండ్కు పంపించారు, ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
Game Changer : నా ఫోన్లో రామ్ చరణ్ పేరును ‘ఆర్సీ ద కింగ్’ అని సేవ్ చేసుకున్న : ఎస్ జే సూర్య
ఇక జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం గురించి పురందేశ్వరి పేర్కొన్నారు. బిల్లును జేపీసీకి రిఫర్ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ బిల్లును పరిశీలించడానికి జేపీసీ ఏర్పాటయిందని, పార్టీలు, ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జమిలి ఎన్నికల సవరణ బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుపై చర్చ జరుగుతుందని, సమగ్ర సమీక్షకు జేపీసీ వద్ద బిల్లును పంపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అర్జున్ రామ్ మేఘవాల్ చెప్పారు. ఇదే సమయంలో, పార్లమెంట్లో బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు పడ్డాయి, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించారు.
Congo: కాంగోలో పడవ బోల్తా.. 38 మంది మృతి, 100కి పైగా గల్లంతు!
తాజావార్తలు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..