Hyderabad: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్.. వీవీఐపీల పేరుతో మోసాలు
- హైదరాబాద్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
- హత్యాయత్నం కేసులో మొయినాబాద్ పోలీసులకు చిక్కిన సయ్యద్ బుర్హానుద్దీన్
- బెంజ్కారు, క్రికెట్ బ్యాట్, ఐరన్ రాడ్, 25 హాకీ స్టిక్స్ స్వాధీనం
- నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో 15 కేసులు.
హైదరాబాద్లో మోస్ట్వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ అయ్యాడు. హత్యాయత్నం కేసులో మొయినాబాద్ పోలీసులకు చిక్కాడు క్రిమినల్ సయ్యద్ బుర్హానుద్దీన్.. అతని వద్ద నుంచి బెంజ్ కారు, క్రికెట్ బ్యాట్, ఐరన్ రాడ్, 25 హాకీ స్టిక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ మాజీ మంత్రి అన్న కొడుకును హనీట్రాప్లోకి దించాడు క్రిమినల్ బుర్హానుద్దీన్.. ఆ తర్వాత అతన్ని బ్లాక్మెయిల్ చేసి రూ.25 లక్షలు వసూలు చేశాడు కేటుగాడు. అంతేకాకుండా… రాహుల్ గాంధీ పీఏ నంటూ అప్పటి జార్ఖండ్ సీఎంకు ఫోన్ చేశాడు.. మైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ అప్పటి జార్ఖండ్ సీఎంకు ఫోన్లో హుకుం జారీ చేశాడు. అయితే.. అప్పటి జార్ఖండ్ సీఎం ఆదేశాలతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోనే నిందితుడిపై 11 కేసులు, ఇతర రాష్ట్రాల్లో మరో 4 కేసులు ఉన్నాయి. ఈడీ కేసులో ఓ ఐఏఎస్ అధికారిని బ్లాక్మెయిల్ చేశాడు క్రిమినల్ బుర్హానుద్దీన్.. ఈడీ కేసు నుండి తప్పిస్తానంటూ ఓ ఐఏఎస్ అధికారి నుండి కోటిన్నర వసూలు చేశాడు.
Read Also: Turkey: టర్కీలో ఘోర అగ్నిప్రమాదం.. 66 మంది మృతి
Also Read
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
కాగా.. ఈ ఘరానా కంత్రీగాడీని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పలువురు వీవీఐపీల పేరుతో మోసాలకు పాల్పడ్డాడు సయ్యద్ బురానుద్దీన్.. రాహుల్ గాంధీ పీఏ నంటూ ఛత్తీస్ఘడ్లో మోసాలకు పాల్పడ్డాడు. ఏకంగా ఛత్తీస్ఘడ్ సీఎం కార్యాలయం సిబ్బందికే కుచ్చుటోపీ వేసేందుకు ప్రయత్నించాడు. మైనింగ్ ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయల మేర మోసం చేశాడు. ఛత్తీస్ఘడ్ క్యాడర్ కి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని మోసం చేశాడు. పీఎం కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ ఐఏఎస్ను నమ్మించాడు మోసగాడు.. ఐఏఎస్ పై అప్పటికే కొనసాగుతున్న సీబీఐ ఎంక్వయిరీని రద్దు చేయిస్తానంటూ కోటిన్నర రూపాయలు తీసుకొని పారిపోయాడు ఈ జాదుగాడు.. అంతేకాకుండా.. హైదరాబాదులో ఓ బిజినెస్మెన్కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసి ఆ వ్యాపారిని మోసం చేశాడు. నకిలీ ఈడీ కార్యాలయాన్నే సృష్టించాడు కేటుగాడు.. అదే కార్యాలయానికి వ్యాపారిని పిలిపించి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. మరోవైపు.. మొయినాబాద్లో రెండేళ్ల క్రితం ఓ భూ కబ్జా చేసే ప్రయత్నంలో అతనిపై కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తులో సయ్యద్ బురానుద్దీన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో సయ్యద్ బురానుద్దీన్ ఘరానా మోసాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Salary Accounts: శాలరీ అకౌంట్ ఉందా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
తాజావార్తలు
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!