ఏపీలో మరో బాదుడు మొదలైంది. ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందన్నారు ఆర్టీసీ ఎండీ. ఆర్టీసీకి లాభాలు లేకుండా.. కనీసం ఆర్టీసీ బస్సులు నిర్వహించేందుకు వీలుగానే ఛార్జీల సవరణ వుంటుందన్నారు MD ద్వారకా తిరుమలరావు. ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి వచ్చింది. డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నాం. పల్లె వెలుగు బస్సుల్లో రూ.2 పెంచుతున్నాం. ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నాం. పల్లె వెలుగు బస్సులో రేపట్నుంచి కనిష్ఠ…
అన్ని చార్జీలు మోత మోగుతున్నాయి.. కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేకుండా వరుసగా అన్ని చార్జీలు పెంచేస్తున్నాయి.. ముఖ్యంగా పెట్రో చార్జీల పెంపు ప్రభావం అన్నింటిపై పడుతోంది.. ఇప్పటికే తెలంగాణలో ఈ మధ్యే రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు వడ్డించారు.. పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో ఇది తప్పలేదని పేర్కొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్లోనూ ఆర్టీసీ చార్జీల వడ్డనకు రంగం సిద్ధం అయ్యింది.. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది.. బస్సు ఛార్జీల పెంపునకు…
మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీసీ ప్రకటించింది. శివరాత్రి సందర్భంగా ఏపీలోని 96 శైవక్షేత్రాలకు 3,225 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆయా బస్సుల్లో గతంలో మాదిరిగానే అదనపు ఛార్జీలు ఉంటాయని తెలిపారు. గుంటూరు జిల్లా కోటప్పకొండకు 410 బస్సులు, శ్రీశైలానికి 390 బస్సులు నడపనున్నట్లు వారు పేర్కొన్నారు. మరోవైపు కడప జిల్లా పొలతల, నిత్య పూజకోన, పశ్చిమ గోదావరి జిల్లాలోని బలివె, పట్టిసీమ తదితర…
ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని కొంత ప్రభుత్వానికి ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు. ఎంత మేర ప్రభుత్వానికి ఇవ్వాలనేది చర్చించి నిర్ణయిస్తాం. గతంలో ఆర్టీసీ బల్క్ కింద డీజిల్ కొనడం వల్ల రిటైల్ కంటే తక్కువగా ధరకు లభ్యమయ్యేది. టెండర్ల ద్వారా ఇంధన తయారీ సంస్థల నుంచి మూడేళ్లకోసారి టెండర్లు వేసి కొంటున్నాం అన్నారు. ఆర్టీసీ ఏడాదికి 30 కోట్ల లీటర్లు డీజిల్ ను కొంటుంది. మార్చి 1నుంచి కొత్త…
ఏపీలో ఆర్టీసీకి చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. సాధారణంగా నిత్యం లక్షల లీటర్ల డీజిల్ వినియోగించే ఆర్టీసీకి చమురు కంపెనీలు బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు డీజిల్ను సరఫరా చేస్తుంటాయి. అయితే 10 రోజులుగా బయట పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధర కంటే ఆర్టీసీకి ఇచ్చే డీజిల్ ధర రూ.4.30 వరకు అదనంగా వడ్డిస్తున్నాయి. దీంతో ఆర్టీసీపై రూ.10 కోట్ల భారం పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు బయట పెట్రోల్ బంకుల్లో డీజిల్…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక మెమోరాండం సమర్పించింది. Read Also: పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: సజ్జల ఆర్టీసీ ఎండీ…
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పాటు పొరుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులతో పోటీ పడేందుకు వీలుగా ఇకపై ఏసీ బస్సుల్లో అవసరాన్ని బట్టి ఛార్జీలు తగ్గించేలా ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ ప్రభావం, చలి కాలం కారణంగా ప్రస్తుతం ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రద్దీని బట్టి ఛార్జీలు వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. Read Also: ఏపీలో కొత్త లెక్కలు……
పండుగ సమయాల్లో 50 శాతానికి పైగా ఛార్జీలు వసూలు చేసే ఏపీ ఎస్ ఆర్టీసీ అధికారులకు అన్ సీజన్లో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. విజయవాడ – హైదరాబాద్ మధ్య తిరిగే వివిధ బస్సులకు ఛార్జీలు తగ్గించారు. విజయవాడ- హైదరాబాద్ మధ్య ఛార్జీలు తగ్గించాలని నిర్ణయించారు. ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో 20 శాతం వరకు ఛార్జీలు తగ్గిస్తామని ఆర్ఎం యేసు దానం తెలిపారు. విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు ఆదివారం.…
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది.. ఉద్యోగాల కోసం, బతుకుదెరువు కోసం కన్నఊరిని విడిచి ఇతర పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలకు తరలివెళ్లినవారు అంతా సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు.. ఇదే సమయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి రవాణా సంస్థలు.. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడుపుతోన్న ఏపీఎస్ఆర్టీసీ కూడా.. 50 శాతం అదనపు వడ్డింపు తప్పదని స్పష్టం చేసింది.. అయితే, దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.. అసలే ప్రజలు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు…
సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సంక్రాంతికి 6,970 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, జనవరి 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు. గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచామని, అదనపు సర్వీసులకు ప్రత్యేకంగా సర్వీస్ కోడ్ ఇచ్చామన్నారు. 9 వేల సిరీస్తో సంక్రాంతి స్పెషల్ సర్వీసులు నడువనున్నాయన్నారు. డీజిల్ రేట్లు…