RTC Charges: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం.. కాసేపట్లో ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని చార్జీలు మోత మోగుతున్నాయి.. కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేకుండా వరుసగా అన్ని చార్జీలు పెంచేస్తున్నాయి.. ముఖ్యంగా పెట్రో చార్జీల పెంపు ప్రభావం అన్నింటిపై పడుతోంది.. ఇప్పటికే తెలంగాణలో ఈ మధ్యే రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు వడ్డించారు.. పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో ఇది తప్పలేదని పేర్కొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్లోనూ ఆర్టీసీ చార్జీల వడ్డనకు రంగం సిద్ధం అయ్యింది.. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది.. బస్సు ఛార్జీల పెంపునకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఆర్టీసీ అధికారులు.. ఆమోదం కోసం వారం క్రితమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపించారు.. అయితే, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ ఛైర్మన్, ఆర్టీసీ ఎండీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో.. ఇక, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ ప్రకటన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పెరిగిన పలు రకాల చార్జీలపై విపక్షాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
Read Also: Harish Rao: భవిష్యత్ లేని పార్టీ కాంగ్రెస్.. ఏం చూసి ఓట్లు వేయాలి..!
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
అనాధికారిక సమాచారం ప్రకారం.. కనీస ఆర్జినరీ బస్సుల్లో టికెట్ ధర రూ.5 ఉండగా.. దానిని రెట్టింపు చేసే అవకాశం ఉంది.. ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉన్న కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కు పెంచనున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస టికెట్ ధర రూ.45 కాగా రూ.60కి చేరే అవకాశం ఉంది.. ఏసీ బస్సుల్లో కనీస ధర రూ.100కు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ చార్జీలు పెరగడం ఇది రెండోసారి.
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..