Massive Fraud in LIC: ఎల్ఐసీలో భారీ మోసం.. నకిలీ డెత్ సర్టిఫికెట్స్తో కోట్లు స్వాహా..
- కందుకూరు ఎల్ఐసీ లో వెలుగు చూసిన మోసం..
- నకిలీ డెత్ సర్టిఫికెట్స్ తో రూ.3కోట్లకు పైగా స్వాహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive Fraud in LIC: ఎల్ఐసీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుంది.. ఎల్ఐసీలో పాలసీ చేస్తే.. తమ సొమ్ము భద్రంగా ఉంటుందని భావిస్తారు.. అయితే, కొందరు ఉద్యోగుల తీరు ఆ సంస్థకు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.. దేశవ్యాప్తంగా విశ్వసనీయతకు మారుపేరైన ఎల్ఐసీలో భారీ మోసం వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా కందుకూరు ఎల్ఐసీ కార్యాలయంలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న పూజల శ్రీనివాసరావు.. నకిలీ డెత్ సర్టిఫికెట్లను ఉపయోగించి కోట్ల రూపాయల బీమా క్లెయిమ్స్ స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు.
Also Read
- Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- Hyderabad: న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య వెనుక మిస్టరీ ఇంతుందా?
- Husband Murder: ఖతర్నాక్ వైఫ్.. భర్తపై 3 కోట్ల బీమా చేసి కన్నింగ్ స్కెచ్.. చివరికిలా!
ఎల్ఐసీలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకున్న శ్రీనివాసరావు, వివిధ పాలసీలకు నామినీలుగా తన కుటుంబ సభ్యులను చూపిస్తూ సుమారు 97 నకిలీ క్లెయిమ్స్ దాఖలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ మోసం ద్వారా రూ.3 కోట్లకు పైగా అక్రమంగా పొందినట్లు ఎల్ఐసీ అధికారులు నిర్ధారించారు. ఏజెంట్గా తన కెరీర్ ప్రారంభించిన శ్రీనివాసరావు, మూడేళ్ల క్రితం డెవలప్మెంట్ ఆఫీసర్గా పదోన్నతి పొందాడు. ఈ హోదాను అడ్డం పెట్టుకుని పాలసీ హోల్డర్ల మృతిచెందినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి, క్లెయిమ్స్ మంజూరు అయ్యేలా వ్యవస్థను దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఎల్ఐసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, ఈ స్కాం వెనుక ఉన్న మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టేందుకు విజిలెన్స్ టీమ్ను రంగంలోకి దింపారు. ఈ కేసులో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా? నకిలీ పత్రాల తయారీలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? అనే అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైతే శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా ఎల్ఐసీ సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఎల్ఐసీ వ్యవస్థలో భద్రతా లోపాలపై చర్చకు దారి తీసింది. భవిష్యత్లో ఇలాంటి మోసాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్ఐసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..