సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారికి గుడ్ న్యూస్ అందించింది. క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో 60 రోజుల ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల డిమాండ్ను బట్టి ప్రస్తుతానికి ఏడు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి మూడు, కాకినాడకు రెండు,…
పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడిపోయింది.. అశ్వారావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ చిన్నారావు, తొమ్మిది మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది మృతిచెందారు.. మరికొందరి పరిస్ధితి విషమంగా ఉంది.. అయితే, ఆ ప్రమాదానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. Read…
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్… పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో ఇప్పటికే ఐదుగురు మహిళలు సహా 9 మంది మృతిచెందారు.. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు పోలీసులు.. అయితే, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వైఎస్…
క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్కు గడువు ను పొడిగించింది. దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచీ ఈ గడువును 60 రోజులకు పొడిగిస్తూ ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి…
సాధారణంగా విద్యార్థులు బస్ పాస్ పొందడమే కాదు.. దాని రెన్యూవల్ కు కూడా ఎంతో శ్రమించాల్సి వస్తుంది.. రెన్యూవల్ డేట్ వచ్చిందంటే చాలు.. విద్యార్థులు, విద్యార్థినులకు కష్టాలు తప్పడం లేదు.. గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి.. ఇక, కొన్ని సార్లు క్లాసులకు డుమ్మా కొట్టి బస్ పాస్ రెన్యూవల్ కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ, త్వరలోనే విద్యార్థుల బస్ పాస్ రెన్యూవల్ కష్టాలు తొలగిపోనున్నాయి… ప్రతి నెలా ఆన్లైన్లోనే విద్యార్థుల బస్ పాస్లు రెన్యూవల్…
పండుగలు వచ్చాయంటే చాలు.. పట్టణాల్లో స్థిరపడినవారు సైతం.. తాను పుట్టిన ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.. దీంతో, రద్దీ పెరిగిపోతోంది.. అయితే, రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ప్రత్యేకంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.. ఈ బస్సులు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, పండుగన సీజన్లో ప్రత్యేక బస్సులను…
ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి.. అయితే, ఓ కుదుపు కుదిపి.. ముందుకు దూసుకెళ్లినా.. బస్సులోని ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుండి మారేడుమిల్లి మీదుగా గుర్తేడు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు వెనక చక్రాలు ఊడిపోయాయి.. వై. రామవరం మండలం ఎడ్లకొండ వద్దకు బస్సు రాగానే.. రెండు వెనుక చక్రాలు ఒక్కసారిగా బస్సు నుంచి విడిపోయాయి.. పెద్దశబ్దం రావడంతో బస్సులో ఉన్నవారితో పాటు…
కరోనా ప్రభావం పబ్లిక్ ట్రాన్స్ఫోర్ట్పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. లాక్డౌన్ దెబ్బకు ఆర్టీసీ బస్సులు, అద్దె బస్సులు అన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి… ఇక, ఆ తర్వాత క్రమంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కినా.. అద్దె బస్సుల చక్రాలు మాత్రం కదలలేదు.. అయితే, అద్దె బస్సుల వినియోగానికి ఏపీఎస్ఆర్టీసీ అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీంతో, సెప్టెంబరు 1 నుంచి అద్దె బస్సులను నడిపేందుకు సిద్ధం కావాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది సర్కార్.. మరోవైపు.. ప్రత్యేకంగా మార్గదర్శకాలు కూడా…
కరోనా సమయంలో ఆర్టీసీ బస్సులు మునుపడిలా తిరిగే పరిస్థితి లేదు.. చాలా బస్సులు డిపోలకే పరిమితమైన పరిస్థితి.. ఈ సమయంలో.. ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది ఏపీఎస్ ఆర్టీసీ… దీంట్లో భాగంగా.. పల్లెవెలుగు బస్సులకి కొత్త రూపు ఇస్తున్నారు.. కార్గో ఆదాయంపై ఫోకస్ పెట్టిన ఏపీఎస్ ఆర్టీసీ.. కాలం చెల్లిన పల్లె వెలుగు బస్సులను కార్గో క్యారియర్లుగా మార్చేస్తోంది… ఇప్పటికే 80 బస్సుల్లో 30 బస్సులను కార్గో క్వారియర్లుగా తయారు చేసింది ఆర్టీసీ.. నెల్లూరుకు 10 బస్సులను…
ఎలక్ట్రిక్ బస్సులను నడిపే అంశంపై మళ్లీ ఫోకస్ పెట్టింది ఏపీ ఆర్టీసీ. 350 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ భావిస్తుంది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై బిడ్లను ఆహ్వానించిన ఏపీఎస్సార్టీసీ… విశాఖకు 100, విజయవాడ, తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్, కాకినాడ, అమరావతికి నగరాలకు 50 బస్సులు చొప్పున కేటాయించింది ఏపీ ప్రభుత్వం. కేంద్రం నుంచి ప్రొత్సహకం రూపంలో బస్సుకు రూ. 55 లక్షలు రానున్నాయి. గతంతో పోలిస్తే ఈ-బస్ బ్యాటరీ ధరలు తగ్గాయి. 50 శాతం మేర…