కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది తిరుమలకు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమల కిక్కిరిసిపోనుంది.. అయితే, ఈ సమయంలో.. ఏపీఎస్ఆర్టీసీ, తిరుపతి విభాగం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వారం తెరిచి ఉంచే 10 రోజులపాటు దర్శన టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం రచ్చగా మారుతోంది.. ఆర్టీసీ నిర్ణయంపై వెంకన్న భక్తులు మండిపడుతున్నారు..…
సంక్రాంతి సమయంలో ప్రత్యేక బస్సులు నడుపుతూ అదనపు ఛార్జీలు వసూలు చేయడం చూస్తూ వచ్చాం.. ఆర్టీసీకి కూడా దీనికి మినహాయింపు ఏమీకాదు.. ఇక, ప్రైవేట్ ట్రావెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. పండుగలను క్యాష్ చేసుకునే పనిలో భాగంగా.. అదనంగా బాదేస్తూనే ఉన్నారు.. అయితే, సంక్రాంతి సమయంలో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ.. ఇప్పటికే ఆన్లైన్లో సంక్రాంత్రికి బుకింగ్స్ ప్రారంభించింది ఆర్టీసీ.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.. www.apsrtconline.in…
పండుగలు వచ్చాయంటే చాలు.. ప్రత్యేక సర్వీసులను నడపడం.. ఇదే సమయంలో చార్జీలను భారీగా పెంచి క్యాష్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే.. ఈ సమయంలో అందినకాడికి దోచుకుంటాయనే విమర్శలు ఉన్నాయి.. అయితే, సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రావాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ).. జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది.. ఇదే…
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులు ఆకట్టుకుంటున్నాయి. ‘స్టార్ లైనర్’ పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చారు. 2+1 స్లీపర్ కోచ్ తరహాలో ఉండే ఈ బస్సులో 30 బెర్తులు ఉంటాయి. ఏసీ పడని వారికి ఈ బస్సు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ బస్సులో చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. రీడింగ్ ల్యాంప్స్, సీసీటీవీ, ఆడియో, ఛార్జింగ్ పోర్ట్స్, ఫైర్ సేఫ్టీ అలారమ్, ప్రతి బెర్త్కు లగేజ్ ర్యాక్ లాంటి…
ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టించింది… కృష్ణా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.. విజయవాడ నుండి గుడివాడ వెళ్తున్న గుడివాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు.. పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం సమీపానికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది.. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి… నిమిషాల వ్యవధిలో బస్సు మొత్తం వ్యాపించాయి.. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేస్తున్నారు.. మంటలు చెలరేగడంతో.. ఆందోళనకు గురైన.. కేకలు…
దసరా పండుగ సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్వయంగా వెల్లడించారు.. దసరా సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ భక్తుల సౌకర్యం కోసం స్పెషల్ బస్సులను తిప్పనున్నాం.. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 4500 స్పెషల్ బస్సులు నడుపుతామని తెలిపారు.. 2100 ఫ్రీ దసరా బస్సులు నడుపుతాం.. సాధారణ ఛార్జీలతోనే అదనపు బస్సులు తిప్పుతామని స్పష్టం…
దసరా పండుగ సమయంలో ప్రయాణికులకు శుభవార్త వినిపించింది ఆర్టీసీ. ఈ నెల 29 వ తేదీ నుంచి వచ్చే నెల 10 వ తేదీ వరకు విజయవాడ దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.