Karnataka: పిల్లలు లేరన్న కోపంతో భార్యను చంపిన భర్త.. హార్ట్ ఎటాక్గా చిత్రీకరించి చివరికీ..
- పెళ్లై మూడేళ్లు అయింది..
- పిల్లలు లేకపోవడంతో భార్యభర్తల మధ్య గొడవ..
- కోపంలో భార్యను చంపేసిన భర్త.. హార్ట్ ఎటాక్ గా చిత్రీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని బెలగావి జిల్లా నెగినహాల్ గ్రామంలో జరిగిన ఘోర విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరి ఫకీరప్ప గిలక్కణవర మృతి మొదట హార్ట్ అటాక్గా చిత్రికరించినప్పటికీ, చివరకు అది హత్యగా తేలింది. ఈ దారుణానికి ఆమె భర్త ఫకీరప్ప గిలక్కణవర పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా, రాజేశ్వరి మృతి చెందిన తర్వాత, ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయిందని భర్త అందరికీ చెప్పాడు. అంత్యక్రియల కోసం బంధువులను స్వగ్రామానికి పిలిచాడు. అయితే, అంత్యక్రియలకు వచ్చిన రాజేశ్వరి తల్లిదండ్రులు ఆమె మెడపై ఉన్న గాయాలను గమనించి.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్వరి- ఫకీరప్పకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరన్న కారణంతో భర్త ఆమెను వేధించేవాడని ఆరోపించారు. ఈ విషయంపై తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవని చెప్పుకొచ్చారు.
Read Also: Ajith Kumar : రెండేళ్లకో సినిమాతో కనిపిస్తున్న అజిత్.. సినిమాలపై ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
అయితే, హత్య గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇది సహజ మరణం కాదని, హత్య అయ్యే అవకాశం ఉందని అనుమానించి రాజేశ్వరి భర్త ఫకీరప్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కోపోద్రిక్తుడైన ఫకీరప్ప రాజేశ్వరిని గొంతు పిసికి హత్య చేసినట్లు అంగీకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం ఈ హత్యను హార్ట్ ఎటాక్గా చూపించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. అయితే, రాజేశ్వరి మృతదేహాన్ని బెలగావి BIMS ఆసుపత్రికి పోస్ట్మార్టం కోసం తరలించారు. పోస్ట్మార్టం నివేదికలో ఇది హత్యేనని నిర్ధారణ అయ్యింది. దీంతో ఫకీరప్పపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం బీఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయ్యాక రాజేశ్వరి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!