Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Rtc Md Dwarakatirumala Rao On Income Sharing

RTC MD Dwarakatirumala Rao: ఆర్టీసీ ఆదాయంలో కొంత ప్రభుత్వానికి

Published Date :February 22, 2022 , 4:56 pm
By NTV WebDesk
RTC MD Dwarakatirumala Rao: ఆర్టీసీ ఆదాయంలో కొంత ప్రభుత్వానికి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని కొంత ప్రభుత్వానికి ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు. ఎంత మేర ప్రభుత్వానికి ఇవ్వాలనేది చర్చించి నిర్ణయిస్తాం. గతంలో ఆర్టీసీ బల్క్ కింద డీజిల్ కొనడం వల్ల రిటైల్ కంటే తక్కువగా ధరకు లభ్యమయ్యేది. టెండర్ల ద్వారా ఇంధన తయారీ సంస్థల నుంచి మూడేళ్లకోసారి టెండర్లు వేసి కొంటున్నాం అన్నారు.

ఆర్టీసీ ఏడాదికి 30 కోట్ల లీటర్లు డీజిల్ ను కొంటుంది. మార్చి 1నుంచి కొత్త రేట్లు అమల్లోకి రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ నుంచి బల్క్ వినియోగదారుల రేట్లు పెరుగుతున్నాయి. రిటైల్ కంటే బల్క్ గా కొంటే డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి1 న రిటైల్ గా డీజిల్ రూ. 96.02 ఉంటే బల్క్ గా రూ. 96.24కు పెరిగింది. ఫిబ్రవరి 15 నాటికి రిటైల్ గా 96.02 ఉంటే బల్క్ ఇంధనం ధర 100.41 పైసలు ఉంది. రిటైల్ కంటే రూ. 4.39 లీటరుకు ఎక్కువగా మాకు డీజిల్ ధర పెరిగింది.

ఆర్టీసీకి రోజుకు రూ. 32 లక్షలు అదనంగా ఖర్చు అవుతోంది. ఏలూరు, రాజోలు, రంగంపేట, ఉరవకొండలో మాకు రిటైల్ పెట్రోల్ బంకులున్నాయి.రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. అన్ని చోట్లా రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయాలని నిర్ణయించాం. బల్క్ రేట్లు తగ్గినపుడు ఆయిల్ తయారీ సంస్థల నుంచి తిరిగి కొంటాం అన్నారు ఎండీ ద్వారకా తిరుమలరావు.

2013లోనూ ఇలాంటి సమస్యే ఎదురుకావడంతో అప్పట్లో ఇలాగే నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలోనూ బయట పెట్రోల్ బంకుల నుంచి రిటైలుగా ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో 100 ఎలక్ట్రిటిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. ప్రయోగాత్మకంగా 100 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుతాం. ఇలా మార్చడం వల్ల బస్సుకు 60 లక్షలు ఖర్చవుతాయి. కారుణ్య నియామకాలన్నీ పూర్తి చేస్తాం. పెండింగులో ఉన్న 2015-2019 వరకు కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విలేజ్ వార్డు సెక్రటేరియట్ ,ఆర్టీసీ లోని ఖాళీల్లో భర్తీ చేస్తాం.

రెండింటిలోనూ అర్హత లేని వారికి కలెక్టర్ ద్వారా భర్తీ చేస్తాం. కారుణ్య నియామకాలపై ఎవరూ కంగారు పడవద్దని కోరుతున్నాం. 1500 మందికి కారుణ్య నియామకాలకింద ఉద్యోగాలిస్తాం. వీలైనంత త్వరలో నియామకాలు పూర్తి చేస్తాం. విలీనం తర్వాత మెడికల్ అన్ ఫిట్ అయిన వారి పిల్లలకు కారుణ్య నియామకాలు వుంటాయన్నారు ద్వారకా తిరుమల రావు. విలీనానికి ముందు మెడికల్ అన్ ఫిట్ వారి పిల్లలకు మేనిటరీ బెనిఫిట్స్ మాత్రమే ఇస్తాం.బల్క్ ధరలు తగ్గాక ప్రభుత్వ వాహనాలకూ త్వరలో ఆర్టీసీ ద్వారా డీజిల్ సరఫరా చేయబోతున్నామన్నారు.

ఆర్టీసీ విలీనం అనంతరం సంస్థ నష్టాలు తగ్గుతున్నాయి. కోవిడ్ ముందు కార్గో ద్వారా ఏటా రూ. 97.44 కోట్లు ఆదాయం వచ్చింది. గతంలో రోజుకు 18 వేలు పార్సిళ్లు ఉండగా 22 వేల పైగా పార్సిళ్లు పెరిగాయి. సీసీఎస్ కు ఉన్న రూ. 269 కోట్లు అప్పు తీర్చేశాం. పీఎఫ్ లోని అప్పు రూ. 640 కోట్లు తీర్చాం. కోవిడ్ మూడు నెలలుగా సంస్థ పరిస్థితి మెరుగు పడుతోంది. డీజిల్ ధరలు పెరిగినా టికెట్ ధరలు పెంచలేదు. కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసులోని సమస్యలను పరిష్కరిస్తున్నాం.

https://ntvtelugu.com/ap-high-court-fired-on-ttd-board-members/

ఆర్టీసీ ఉద్యోగులకు క్యాడర్ ఫిక్సేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగులు ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యోగులు అందోళన ,హడావుడి పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఒక్కొక్కటిగా సమస్యలు పరుష్కరిస్తున్నాం.ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని హితవు పలికారు ఎండీ ద్వారకా తిరుమలరావు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap govt
  • apsrtc
  • cm jagan
  • diesel prices
  • Dwaraka tirumal rao

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions