రాష్ట్రవ్యాప్తంగా 659 అద్దె బస్సులు ప్రవేశపెట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. 203 పల్లె వెలుగు, 208 ఆల్ట్రా పల్లె వెలుగు, 39 మెట్రో ఎక్స్ప్రెస్, 70 ఎక్స్ప్రెస్, 22 అల్ట్రా డీలక్స్, 46 సూపర్ లగ్జరీ, 9 ఏసీ స్లీపర్, 47 నాన్ ఏసీ స్లీపర్, 6 ఇంద్ర బస్సులు, 9 సిటీ ఆర్డినరీ బస్సులకు ఆర్టీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. జిల్లాల వారీగా అద్దె బస్సులు, సంఖ్యను నిర్ణయించి ఈ మేరకు టెండర్లను ఆహ్వానించారు. నేటి నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు బిడ్లు దాఖలు చేయాలని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి కోరారు. MSTC ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా టెండర్ల ప్రక్రియ చేపడతామన్నారు.
Read Also: టూరిస్టులకు అనుమతి లేని 10 అందమైన ప్రదేశాలు
జిల్లాల వారీగా అద్దెకు తీసుకుంటున్న బస్సుల వివరాలు: శ్రీకాకుళం-39, మన్యం-32, విజయనగరం-14, విశాఖ-61, అనకాపల్లి-22, కాకినాడ-41, తూ.గో-27, కోనసీమ-39, ప.గో-52, ఏలూరు-21, కృష్ణా-28, ఎన్టీఆర్-12, గుంటూరు-26, పల్నాడు-30, బాపట్ల-6, ప్రకాశం-10, నెల్లూరు-39, తిరుపతి-35, చిత్తూరు-2, అన్నమయ్య-10, వైఎస్ఆర్-6, నంద్యాల-29, కర్నూలు-14, అనంతపురం-31, సత్యసాయి-33