Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే రూ. 6 లక్షల కోట్లు గోవిందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం తీవ్ర క్షీణతను చవిచూసింది. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1 శాతం పడిపోయాయి. నిజానికి శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీతో సహా అన్ని చోట్లా బలహీనత కనిపించింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు గణనీయమైన క్షీణతను చవిచూశాయి. 1.5 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ భారీ స్టాక్ మార్కెట్ పతనం పెట్టుబడిదారులకు రూ.6 లక్షల కోట్ల నష్టం కలిగించింది. BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.458.50 లక్షల కోట్ల నుంచి రూ.452.52 లక్షల కోట్లకు పడిపోయింది. BSE 30లోని 10 స్టాక్లు మినహా, మిగిలిన 20 స్టాక్లు గణనీయమైన నష్టాలతో ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్, జొమాటో, ఇండిగో, బజాజ్ ఫైనాన్స్ వంటి స్టాక్లలో అతిపెద్ద క్షీణతలు కనిపించాయి.
READ ALSO: Anil Ravipudi : రాజమౌళితో కంపారిజన్.. రావిపూడి షాకింగ్ కామెంట్స్
Also Read
- KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
సెన్సెక్స్ 805 పాయింట్లు తగ్గి 81,503 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 254 పాయింట్లు తగ్గి 25034 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్లు పడిపోయింది. ట్రేడింగ్ సమయంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గణనీయంగా తగ్గాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ అత్యధికంగా 13 శాతం తగ్గి రూ.794 వద్ద ట్రేడవుతోంది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 13 శాతం వరకు పడిపోయాయి. అదానీ షేర్లు పడిపోడానికి కారణం.. 265 మిలియన్ డాలర్ల విలువైన మోసం, లంచంపై వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీలను ఇమెయిల్ ద్వారా వ్యక్తిగతంగా పిలిపించేందుకు యుఎస్ కమిషన్, యుఎస్ మార్కెట్ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి కోరడంతో అదానీ షేర్లు పడిపోయాయి.
52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్న 328 స్టాక్లు..
అదానీ ఎంటర్టైన్మెంట్, ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అక్జో నోబెల్ ఇండియా లిమిటెడ్, అదానీ టోటల్, బాటా ఇండియా లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్ ఒక సంవత్సరం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇదే టైంలో 69 స్టాక్లు ఈరోజు ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
స్టాక్ మార్కెట్ అకస్మాత్తుగా పడిపోడానికి కారణం..
విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుంచి నిరంతరం డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. NSE డేటా ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) మునుపటి సెషన్లో నికర ప్రాతిపదికన రూ.2,144.06 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీనికి విరుద్ధంగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) రూ.3,877.78 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్కు కొంత మద్దతు లభించింది.
తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!