Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే రూ. 6 లక్షల కోట్లు గోవిందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం తీవ్ర క్షీణతను చవిచూసింది. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1 శాతం పడిపోయాయి. నిజానికి శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీతో సహా అన్ని చోట్లా బలహీనత కనిపించింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు గణనీయమైన క్షీణతను చవిచూశాయి. 1.5 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ భారీ స్టాక్ మార్కెట్ పతనం పెట్టుబడిదారులకు రూ.6 లక్షల కోట్ల నష్టం కలిగించింది. BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.458.50 లక్షల కోట్ల నుంచి రూ.452.52 లక్షల కోట్లకు పడిపోయింది. BSE 30లోని 10 స్టాక్లు మినహా, మిగిలిన 20 స్టాక్లు గణనీయమైన నష్టాలతో ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్, జొమాటో, ఇండిగో, బజాజ్ ఫైనాన్స్ వంటి స్టాక్లలో అతిపెద్ద క్షీణతలు కనిపించాయి.
READ ALSO: Anil Ravipudi : రాజమౌళితో కంపారిజన్.. రావిపూడి షాకింగ్ కామెంట్స్
Also Read
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
సెన్సెక్స్ 805 పాయింట్లు తగ్గి 81,503 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 254 పాయింట్లు తగ్గి 25034 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్లు పడిపోయింది. ట్రేడింగ్ సమయంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గణనీయంగా తగ్గాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ అత్యధికంగా 13 శాతం తగ్గి రూ.794 వద్ద ట్రేడవుతోంది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 13 శాతం వరకు పడిపోయాయి. అదానీ షేర్లు పడిపోడానికి కారణం.. 265 మిలియన్ డాలర్ల విలువైన మోసం, లంచంపై వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీలను ఇమెయిల్ ద్వారా వ్యక్తిగతంగా పిలిపించేందుకు యుఎస్ కమిషన్, యుఎస్ మార్కెట్ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి కోరడంతో అదానీ షేర్లు పడిపోయాయి.
52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్న 328 స్టాక్లు..
అదానీ ఎంటర్టైన్మెంట్, ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అక్జో నోబెల్ ఇండియా లిమిటెడ్, అదానీ టోటల్, బాటా ఇండియా లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్ ఒక సంవత్సరం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇదే టైంలో 69 స్టాక్లు ఈరోజు ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
స్టాక్ మార్కెట్ అకస్మాత్తుగా పడిపోడానికి కారణం..
విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుంచి నిరంతరం డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. NSE డేటా ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) మునుపటి సెషన్లో నికర ప్రాతిపదికన రూ.2,144.06 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీనికి విరుద్ధంగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) రూ.3,877.78 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్కు కొంత మద్దతు లభించింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!