Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే రూ. 6 లక్షల కోట్లు గోవిందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం తీవ్ర క్షీణతను చవిచూసింది. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1 శాతం పడిపోయాయి. నిజానికి శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీతో సహా అన్ని చోట్లా బలహీనత కనిపించింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు గణనీయమైన క్షీణతను చవిచూశాయి. 1.5 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ భారీ స్టాక్ మార్కెట్ పతనం పెట్టుబడిదారులకు రూ.6 లక్షల కోట్ల నష్టం కలిగించింది. BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.458.50 లక్షల కోట్ల నుంచి రూ.452.52 లక్షల కోట్లకు పడిపోయింది. BSE 30లోని 10 స్టాక్లు మినహా, మిగిలిన 20 స్టాక్లు గణనీయమైన నష్టాలతో ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్, జొమాటో, ఇండిగో, బజాజ్ ఫైనాన్స్ వంటి స్టాక్లలో అతిపెద్ద క్షీణతలు కనిపించాయి.
READ ALSO: Anil Ravipudi : రాజమౌళితో కంపారిజన్.. రావిపూడి షాకింగ్ కామెంట్స్
Also Read
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
సెన్సెక్స్ 805 పాయింట్లు తగ్గి 81,503 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 254 పాయింట్లు తగ్గి 25034 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్లు పడిపోయింది. ట్రేడింగ్ సమయంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గణనీయంగా తగ్గాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ అత్యధికంగా 13 శాతం తగ్గి రూ.794 వద్ద ట్రేడవుతోంది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 13 శాతం వరకు పడిపోయాయి. అదానీ షేర్లు పడిపోడానికి కారణం.. 265 మిలియన్ డాలర్ల విలువైన మోసం, లంచంపై వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీలను ఇమెయిల్ ద్వారా వ్యక్తిగతంగా పిలిపించేందుకు యుఎస్ కమిషన్, యుఎస్ మార్కెట్ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి కోరడంతో అదానీ షేర్లు పడిపోయాయి.
52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్న 328 స్టాక్లు..
అదానీ ఎంటర్టైన్మెంట్, ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అక్జో నోబెల్ ఇండియా లిమిటెడ్, అదానీ టోటల్, బాటా ఇండియా లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్ ఒక సంవత్సరం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇదే టైంలో 69 స్టాక్లు ఈరోజు ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
స్టాక్ మార్కెట్ అకస్మాత్తుగా పడిపోడానికి కారణం..
విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుంచి నిరంతరం డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. NSE డేటా ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) మునుపటి సెషన్లో నికర ప్రాతిపదికన రూ.2,144.06 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీనికి విరుద్ధంగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) రూ.3,877.78 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్కు కొంత మద్దతు లభించింది.
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!