పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి ఈ అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో నైరుతి బంగాళాఖాతం, దానిని నానుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. నేడు అల్లూరి అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో ఒకటి రెండు…
రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. పార్లమెంట్లో డా బీఆర్ అంబేద్కర్ను కేంద్రమంత్రి అమిత్ షా అవమానపరిచాడని, ఆయనను ప్రధాని మోడీ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలని డిసెంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం అని తెలిపారు. ఆదాని అగ్రిమెంట్పై అవకతవకలు జరిగాయని రాయటర్స్ పత్రిక రాసిందని, సీఎం చంద్రబాబు కూడా ఆదాని అంశంపై స్వందించడం లేదన్నారు. ఆదాని అంశంపై డిప్యూటీ…
ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని, తమది న్యూట్రల్ స్టాండ్ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇండియా కూటమి, ఎన్డీఏలకు తాము సమాన దూరం అని పేర్కొన్నారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట తమ అభిప్రాయం చెబుతాంని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల…
దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్టు చేశారని ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. లేని కేసులు పెట్టడం కూటమి పార్టీ అలవాటుగా చేసుకుందని, వైఎస్ జగన్ పరిపాలనలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కేసులు పెరిగిపోయాయని, ఈ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపును తాము మౌనంగా భరిస్తున్నాం అని తెలిపారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారి సమస్యలు పరిష్కరించాలని…
కూటమి ప్రభుత్వం విద్యత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 27 నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గం వారీగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని, ప్రజలను భాగస్వాములు చేస్తూ కార్యక్రమాన్ని వియవంతం చెయ్యాలని కార్యకర్తలను కోరారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనిపించలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అబద్దాలని ప్రజలకు వివరిస్తాం అని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి మరీ దారణంగా ఉందని, రైతులను నిర్లక్ష్యం చేస్తే…
డా.బీఆర్ అంబేడ్కర్ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ అని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. రాజ్యాంగం, అంబేడ్కర్ను బీజేపీ ఎన్నడూ అగౌరపరచదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తుందని బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అంబేడ్కర్ తమ నాయకుడని చెబుతున్న కాంగ్రెస్.. ఎందుకు భారత రత్న ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. వాజ్పేయీ హయాంలో అంబేడ్కర్కు భారతరత్న ఇచ్చిన ఘనత తమ పార్టీది అని పురందరేశ్వరి పేర్కొన్నారు. అంబేడ్కర్పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను…
నేడు కడప జిల్లాకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. సొంత నియోజవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి కడపకు జగన్ చేరుకోనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లిపోతారు. 24 షెడ్యూల్: వైఎస్ జగన్ మంగళవారం ఉదయం…
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో కలకలం సృష్టించిన పార్సిల్లో డెడ్బాడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సాగి తులసి వచ్చిన పార్సిల్లోని మృతదేహం కాళ్ల మండలంలోని గాంధీనగరంకు చెందిన బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. పని కోసం పిలిపించి పర్లయ్యను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సాగి తులసి చెల్లెలి భర్త సుధీర్ వర్మనే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుధీర్ వర్మ నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఎప్పటికప్పుడు సిమ్ కార్డ్స్,…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం (డిసెంబర్ 24) నుంచి నాలుగు రోజుల పాటు (డిసెంబర్ 27) సొంత నియోజవర్గంలో జగన్ పర్యటిస్తారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని.. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోతారు. 24…
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. ఈ కేసులో పేర్ని నానికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. విచారణలో భాగంగా అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తానన్నారు. తప్పు చేసి డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా? అని మంత్రి ప్రశ్నించారు. పదేపదే నీతి వ్యాఖ్యలు…