పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అల్లు అర్జున్ అంశంను గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారన్నారు. సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో…
సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు మరోసారి పెద్దపీట వేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో చాలామంది బీసీ నేతలు కీలక పదవుల్లో ఉన్నారని, ఇదంతా సీఎం చంద్రబాబు ఘనతే అని మంత్రి అనగాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయనను సీఎస్గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…
2024లో కంటే 2025లో ఎక్కువగా రాకెట్ ప్రయోగాలు చేపడతాం అని డాక్టర్ ఎస్.సోమనాథ్ తెలిపారు. గగన్యాన్ టెస్ట్ ఫ్లైట్ను కూడా మరో 2,3 మాసాల్లో ప్రయోగిస్తామని చెప్పారు. అమెరికాకు చెందిన నిసార్ ఉపగ్రహన్ని కూడా నింగిలోకి పంపనున్నామని సోమనాథ్ పేర్కొన్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ60ని నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి రాత్రి రాత్రి 10:05కి నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ-సీ60 రాకెట్…
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో తిరుపతి-బెనారస్ (07107) ప్రత్యేక రైలు నడవనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి-బెనారస్ (07107) ప్రత్యేక రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో శనివారం రాత్రి 8.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి.. సోమవారం…
బీసీలకు టీడీపీతోనే మేలు జరుగుతుందన్న విషయం మరోసారి రుజువైందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. బీసీల ముద్దుబిడ్డ సీఎం చంద్రబాబు అని, వెనుకబడిన తరగతుల పక్షపాతి చంద్రబాబు అని పేర్కొన్నారు. బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయనను సీఎస్గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్కుమార్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన విజయానంద్ను సీఎస్గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31తో పదవీవిరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్గా విజయానంద్ బాధ్యతలు చేపడతారు. బీసీ అధికారి విజయానంద్కు సీఎస్గా అవకాశం ఇవ్వడంతో టీడీపీ నేతలతో పాటు ప్రభుత్వ…
అమరావతిలో ఈరోజు మద్యాహ్నం 12 గంటలకి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు సంబంధించి చర్చిస్తారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఇంధన శాఖలో కొన్ని కీలక ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలపనుంది. ఈ సమావేశం కోసం ఉదయం 11 గంటలకు సీఎం సచివాలయంకు చేరుకుంటారు. ఈ నెల 31న పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం,…
కరెంట్ చార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా ఏపీ ప్రభుత్వం తయారైందని మాజీమంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు.. మాట తప్పి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. ఈ ఆరు నెలల్లో రూ.15,485 కోట్ల మేరా ప్రజలపై విద్యుత్ భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిమాండుకు అనుగుణంగా సరఫరా చేయలేక అనధికార విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.…
వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాపై వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శలు చేశారు. వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు.. కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారన్నారు. కాపు రిజర్వేషన్ల పైన రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు కానీ.. రంగా ఆశయాల కోసం రాధా ఎక్కడా నిలబడనిలేదన్నారు. రంగా కొడుకు రాధా ఆలోచన తనకు అర్ధం కావడం లేదని, కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఉన్నాయని.. మొత్తంగా 91 కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని బుధవారం ఓ ప్రకనలో చెప్పారు. జనవరి 10, 11, 12వ తేదీలకు గాను 9వ తేదీన ఉదయం…