NDRF Formation: ఏపీకి అమిత్ షా సహకారం మరువలేనిది: పవన్ కల్యాణ్
- 20వ ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు
- అమిత్ షా సహకారం మరువలేనిది
- సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా చేసిన సహకారం మరువలేనిదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 1.57 లక్షల ప్రజల ప్రాణాలను జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ఇప్పటిదాకా కాపాడిందన్నారు. వసుధైక కుటుంబకం అని ప్రధాని మోడీ చెప్పినట్టుగా 19,365 మూగజీవాలని కాపాడిందని ప్రశంసించారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు, విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు గణనీయం పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి సైతం భారత దేశాన్ని కాపాడాల్సి ఉందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.
విజయవాడకు సమీపంలోని కొండపావులూరులో 20వ ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘1.57 లక్షల ప్రజల ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటిదాకా కాపాడింది. 7,465 మృతుల దేహాలను వారి కుంటబాలకు చేర్చింది. వసుధైక కుటుంబకం అని ప్రధాని చెప్పినట్టుగా 19,365 మూగజీవాలని ఎన్డీఆర్ఎఫ్ కాపాడింది. ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు, విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు గణనీయం. ప్రకృతి విపత్తుల నుంచీ సైతం భారత దేశాన్ని కాపాడాల్సి ఉంది. విపత్తుకు స్పందించడమే విపత్తు నిర్వహణ కాదు.. విపత్తు జరిగిన ప్రదేశాన్ని తిరిగి యదాస్ధితికి తేవడం. ఎన్డీఆర్ఎఫ్కు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు నా కృతజ్ఞతలు’ అని అన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
‘2018లో భూమి ఇస్తే.. 2024లో ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ప్రారంభించింది. మానవులు చేసిన విపత్తులు కూడా ఉంటాయి. గత ప్రభుత్వం 2024లో వచ్చి ఉంటే.. ఆ పరిస్ధితి దారుణంగా ఉండేది. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా గత ప్రభుత్వ విపత్తు నుంచి కాపాడుకోగలిగాం. స్టీల్ ప్లాంట్కు కేంద్ర సహకారానికి కృతజ్ఞులం. గత ఆరు నెలలుగా ఏపీకి అమిత్ షా సహకారం మరువలేనిది’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!