కాకినాడ తీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్’ నౌకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈరోజు తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు నౌక బయలుదేరి వెళ్లింది. కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు నౌక బయల్దేరింది. కొటోనౌ పోర్టుకు బయల్దేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం అనుమతిని ఇచ్చారు. హల్దియా నుంచి 2024 నవంబరు 11న కాకినాడ తీరానికి స్టెల్లా షిప్ వచ్చిన విషయం…
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు. ఏ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజులపాటు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు స్పందించారు. భక్తులు సంతృప్తికరమైన సమాధానం అనుభవాన్ని పంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. దర్శనం విషయంలో క్యూలైన్స్లో ఒత్తిడి లేకుండా.. ఏ లైన్ దేనికి అనేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అటవీశాఖ…
ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ‘స్వర్ణ కుప్పం’ పథకం పేరిట కుప్పం రూపురేఖలు మరింతగా మార్చనున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ పథకంను సీఎం ఆరంభించనున్నారు. ఆది, సోమ, మంగళవారం కుప్పంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. నేడు ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్…
గుడివాడలోని రైలుపేటలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి సమీపంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్న ఎండూరి జోజి బాబు (45) చిన్నారిపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైలుపేటలోని బాలిక ఇంటి వద్ద గుడివాడ డీఎస్పీ అబ్దుల్ సుబాన్ స్వయంగా విచారణ…
అఖిరా నందన్ సినిమాల్లోకి రావాలని తానూ కోరుకుంటున్నానని సినీనటి రేణు దేశాయ్ అన్నారు. ఓ తల్లిగా అఖిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా? అని ఆత్రుతగా ఉందన్నారు. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తాడన్నారు. గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ తాను ఎక్కడ చూడలేదని ఆనందోత్సాహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు చూడ్డానికి రెండు కళ్లు సరిపోలేదని సంతోషం వెలిబుచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్…
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టకేలకు దిగొచ్చారు. సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లతకు ఆయన క్షమాపణలు చెప్పారు. ‘సినీ నటి మాధవీ లత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పే. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను. 72 సంవత్సరాల వయసున్న నేను ఆవేశంలో అలా మాట్లాడానే తప్ప.. కించపరచాలనే ఉద్దేశం లేదు’ అని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇక జేసీ, మాధవీ లత మధ్య వివాదంకు తెరపడనుంది.…
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మెగా ఉచిత వైద్య శిబిరం జరుగుతోంది. విజయవాడ కేబీఎన్ కాలేజీలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ‘పశ్చిమ నియోజకవర్గంలో వెరికోస్ వెయిన్స్ సమస్యతో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్యాంపులో వెరికోస్ వెయిన్స్ సమస్యపై నిపుణులైన వైద్యులు సేవలందిస్తున్నారు. ప్రజలందరూ ఉచిత మెగా మెడికల్ క్యాంపుని వినియోగించుకోవాలి’ అని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. అన్ని ప్రాంతాల్లో…
ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నిన్న విజయవాడలోని సింగ్ నగర్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి.. విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. స్థానిక విద్యార్థినులు తమకు ఆకతాయిలతో ఇబ్బందిగా ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. దీంతో నారా లోకేష్ వెంటనే స్పందించి.. గంటల వ్యవధిలో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే మూడు కెమెరాలు ఏర్పాటు అవ్వగా.. మిగతా రెండు…
టీడీపీ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే.. తన పిల్లలను కూడా పక్కన పెడతాను అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తన పీఏ సంధు జగదీష్పై అవినీతి ఆరోపణలు, వేటు నేపథ్యంలో హోంమంత్రి పై వ్యాఖ్యలు చేశారు. తన పీఏను చాలాసార్లు హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదని, అందుకే తానే స్వయంగా తొలగించానని చెప్పారు. నేడు విశాఖ సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత సందర్శించారు. ఇటీవల జైల్లో జరుగుతున్న పరిణామాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ…
ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండుకు చేరుకుంటారు. దత్త ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించే విధంగా షెడ్యుల్ ఫిక్స్ అయింది. 60…