Kandula Durgesh: మాజీ మంత్రి రోజాపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్!
- రోజాపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్
- రోజా పర్యాటక శాఖను నిర్వీర్యం చేసింది
- ప్యాలెస్ ఎందుకు పనికి రావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ పర్యటక శాఖ మంత్రి రోజాపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. దావోస్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదని రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజమండ్రిలో మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్లో అందరినీ దావోస్ తీసుకుని వెళ్లారని అన్నారు. రోజా అవగాహన రాహిత్యంతో చేస్తున్న వ్యాఖ్యలని కొట్టిపారేశారు. గత ప్రభుత్వంలో మంత్రి రోజా పర్యాటక శాఖను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విశాఖపట్నం ఋషికొండ వద్ద పర్యాటక ప్రాంతంలో ప్యాలెస్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. ప్యాలెస్ నిరుపయోగంగా ఉందని, ఎందుకు పనికి రావడం లేదన్నారు. ప్యాలెస్ నిర్మాణం కారణంగా టూరిజనికి వచ్చే ఆదాయానికి గండి పడిందని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు.
‘ఈ నెల 27వ తేదీన విశాఖపట్నంలో పర్యటనశాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. పర్యాటక ప్రాజెక్టులు అమలుపై చర్చ జరుగుతుంది. రూ.170 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి ప్రాజెక్టు, గండికోట ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఇందులో 95 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఉన్న సంబంధాల కారణంగా నిధులు వెంటనే మంజూరు అయ్యాయి. 25 కోట్లతో నాగార్జున సాగర్ దగ్గర రెండు టూరిజం ప్రాజెక్టుల నిర్మాణం ఉంటుంది. ఆఖండ గోదావరి ప్రాజెక్టుకి రెండు, మూడు రోజుల్లో టెండర్లు నిర్వహిస్తాం. పుష్కరాలు నాటికి పర్యాటకంగా అభివృద్ధి అవుతుంది. గండికోట ఆధునీకరణ పనులు చేపట్టి హెరిటేజ్ గా అభివృద్ధి చేస్తాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యంతో పర్యాటక రంగ అభివృద్ధి చెందుతుంది. అమరావతిలో రాష్ట్ర రాజధాని ఏర్పడుతున్న కారణంగా పర్యాటకంగా రివర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది’ అని మంత్రి దుర్గేష్ తెలిపారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- Tags
- ap
- kandula durgesh
- RK Roja
- tdp
- ycp
తాజావార్తలు
-
US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!