కోస్తా జిల్లాల వైపు ‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని ఐఎండీ ఓ ప్రకటలో తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి.. రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం 12 గంటల పాటు తీవ్ర తుపాను తీవ్రత కొనసాగి.. ఆపై తుపానుగా బలహీనపడొచ్చని చెప్పింది. తుపాను ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో…
మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డికి ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా.. గునపాలు దిగుతాయి జాగ్రత్త అని హెచ్చరించారు. పోనీలే అని ఊరుకుంటున్నాం అని, ఇలాగే మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి ఉండదన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని ఏదైనా చేస్తే ఒక్కరు కూడా ఊళ్లో ఉండలేరన్నారు. ఎవరైనా ప్రజల జోలికి వస్తానంటే తాటతీస్తాం అంటూ మంత్రి సత్యకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేతి…
‘మొంథా’ తుఫాన్ ప్రభావం, తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో ఆదివారం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండని సూచించారు. అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం అధికారులకు చెప్పారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ తర్వాత…
రేపటి నుంచి 3 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం యూఏఈలో సీఎం బృందం పర్యటిస్తోంది. వచ్చే నెల 14-15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్కు వివిధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లనున్నారు. 3 రోజుల్లో వివిధ అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో వన్ టూ వన్ మీటింగ్లకు ముఖ్యమంత్రి…
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్.. రాయలసీమ జీవనాడి అయిన హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని విమర్శించారు. కనీసం మోటార్లకు బిల్లులు చెల్లించలేదని, తట్టమట్టి తీయలేదని మండిపడ్డారు. ఐదేళ్ళలో జగన్ చేయలేని పనిని, మొదటి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించాం అని మంత్రి చెప్పారు. కర్నూలులో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష నిర్వహించాడు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు,…
లులూ మాల్ గొంతెమ్మ కోర్కెలపై కూటమి పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ఏపీకి ఆహ్వానించిన ప్రభుత్వమే.. ఇప్పుడు లులూపై గుర్రుగా ఉంది. రాష్ట్రానికి తానే అవసరమన్న ధోరణిలో లులూ ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసంతృత్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లులూకు ప్రభుత్వం ఇచ్చే భూముల విలువ, రాయితీలు ఎన్ని?.. లులూ ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని? అని కేబినెట్లో డిప్యూటీ సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న లులూ.. తిరిగి ప్రభుత్వానికే షరతులు పెట్టడం…
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలి ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణకు మాజీ సీఎం వైఎస్ జగన్ వల్ల ప్రాణ హాని ఉందన్నారు. ఇటీవల మండలిలో బొత్స పనితీరు బావుందని, ఇది జగన్కు నచ్చదు అన్నారు. గతంలో బాబాయ్కు జరిగినట్టే బొత్సకు కూడా జరగచ్చు అన్నారు పల్లా. ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రాణ హాని ఉండదన్నారు. బొత్స తనకు ప్రాణ హాని ఉందని చెప్పడంతో పల్లా శ్రీనివాస్…
అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న విజయవాడకు చెందిన జనార్దన్ రావు అరెస్టును శనివారం చూపకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తాం అని న్యాయవాది రవీంద్రా రెడ్డి తెలిపారు. ‘ఎక్సైజ్ పోలీసులకు లొంగిపోవటానికి జనార్దన్ రావు విదేశాల నుండి వచ్చారు. విజయవాడ వస్తున్నా అని ముందస్తు సమాచారం జనార్ధన్ పోలీసులకు ఇచ్చారు. మదనపల్లి పోలీసులకు లొంగిపోవాలని అధికారులు జనార్దన్కు చెప్పారు. జనార్ధన్ నుంచి బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. జనార్దన్ అరెస్టును…
మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. ఆర్ పేట సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంత మందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం. అందులో భాగంగా A8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నాం. సుబ్బన్నను…
వైద్య ఆరోగ్య రంగంలో కూటమి ప్రభుత్వం పెయిల్ అయ్యిందని వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ‘ఆరోగ్యశ్రీ’ అనారోగ్యశ్రీగా మారిపోయిందని విమర్శించారు. 3 వేల కోట్లు బకాయిలు రాక నెట్ వర్క్ ఆస్పత్రులు బోర్డులు తిపేస్తున్నాయన్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులు బకాయిలు విడుదల చేయాలని అనేక సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. బకాయిలు నిలిచిపోవడంతో సేవలు నిలిపివేశారని, దేశంలో ఎక్కడ ఆరోగ్య సేవలు నిలిచిపోలేదని విడదల రజిని ఫైర్…