సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగించటం శుభపరిణామం అని వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రజల గొంతు నులుమే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని.. లీగల్గా, టెక్నికల్గా తప్పులు చేయటంలో చంద్రబాబు నేర్పరి అని విమర్శించారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో కూటమి నేతలకు చంద్రబాబు నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వైఎస్ జగన్ నామస్మరణే తప్ప.. మరేమీ కనపడటం లేదని మండిపడ్డారు. ప్రజల మేలు కోసం…
భార్య వివాహేతర సంబంధం భరించలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా కుమార్తెకు విషం ఇచ్చి, అనంతరం తాను తాగి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. భార్య, ఆమె ప్రియుడు పరారీలో ఉన్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామంలో చోటుచేయుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భార్య, ప్రియుడి కోసం వెతుకుతూన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి… Also Read:…
రైతు సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సీఎం చంద్రబాబును కలసి వినతిపత్రం అందజేస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం తెలిపిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ‘రైతన్నకు అండగా కాంగ్రెస్’ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సీఎంను కలిసేందుకు ఏపీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి వైఎస్ షర్మిల బయదేరారు. మెడలో ఉల్లిపాయల మాల వేసుకుని ట్రాక్టర్ ఎక్కారు. ట్రాక్టర్తోనే రోడ్డు మీదకు వెళ్లే ప్రయత్నం చేయగా.. అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.…
ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు రాత్రికి వాయుగుండంగా బలపడుతుంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి 50 నుంచి 60 కిమీ గరిష్ఠ వేగంతో ఈదురుగాలు వీస్తుండగా.. సముద్రం అలజడిగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటలు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. Also…
బెట్టింగ్ యాప్స్పై తెలంగాణ సీఐడీ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. ఏకకాలంలో 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మంది బెట్టింగ్ యాప్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారులు ఉన్నారనే విషయాన్ని గమనించిన సీఐడీ వారికోసం వేట సాగిస్తోంది. మరోవైపు చిత్తూరు జిల్లాలో కేవలం ఇంటర్ చదివి ఓ యువకుడు బెట్టింగ్ యాప్ రూపొందించాడు. కోట్లకు పడగలెత్తాడు. కానీ చివరికి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతను బెట్టింగ్ యాప్స్…
తూర్పుగోదావరి జిల్లాలో శ్రీగంధం చెట్లను అక్రమంగా కొట్టుకుపోయి విక్రయిస్తున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ కి చెందిన ముగ్గురు సంచార జీవనం గడిపే యువకులు ఈ అక్రమ రవాణా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు ముగ్గురినీ అరెస్టు చేశారు. రాజానగరం, కోరుకొండ మండలాల్లో మూడు చోట్ల శ్రీగంధం చెట్లను నరికి తరలిస్తుండగా.. పోలీసులకు అందిన సమాచారంతో రంగంలోకి దిగినట్లు రాజానగరం సీఐ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు. ఎస్సై ప్రేమ్…
‘విజయవాడ’ పేరులోనే విజయం ఉందని.. చరిత్ర రాయాలన్నా, సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. జీవోలన్ని తెలుగులో వస్తున్నాయంటే అది వెంకయ్య నాయుడుతోనే సాధ్యం అని పేర్కొన్నారు. ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే అన్నారు. వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబుతో తాను పోటీ పడలేకపోతున్నానని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో శోభాయమానంగా…
వ్యవసాయం అంటే ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చటానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాలేదని, చంద్రబాబు పుణ్యమా అని రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయారన్నారు. యూరియా కోసం రైతులు పడే అగచాట్లు ఈ ప్రభుత్వ పెద్దలకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. గతంలో కంటే ఎక్కువ తెచ్చామని చెప్తున్న యూరియా ఏమైంది?, రైతులకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లోకి ఎలా…
108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కుయ్ కుయ్ మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి’ అని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు ప్రభుత్వం ఉరివేస్తోందని ఫైర్ అయ్యారు. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనం రాకపోవడంతో.. ఆమె ఆటోలోనే ప్రసవించింది. వైద్యం అందక శిశువు ఆటోలోనే కన్నుమూసింది.…
గుంటూరు జిల్లా తెనాలి మండలంలో మహమ్మారి ‘కలరా’ కలకలం రేపుతోంది. అంగలకుదురు గ్రామంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ అయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సదరు మహిళ ప్రస్తుతం తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, మరో 2-3 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు ఇలా…