Satya Kumar Yadav: డ్రగ్స్ పైన నిఘా పెట్టాలి.. చీటీ లేకుండా మందులు ఇస్తే కఠిన చర్యలు!
- రాష్ట్రంలో డ్రగ్స్ పైన నిఘా పెట్టాలి
- ఎక్స్పైరీ, నిషేధించిన మందులు కూడా దొరుకుతున్నాయి
- చీటీ లేకుండా మందులు ఇస్తే కఠిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో డ్రగ్స్ పైన నిఘా పెట్టాలని, ఈగల్ ఉందని డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆగాల్సిన పని లేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డ్రగ్స్ పని చేయనివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయని, తనకే అలాంటి పరిస్ధితి ఎదురైందన్నారు. ఎక్స్పైరీ మందులు, నిషేధించిన మందులు కూడా దొరుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వంలో జనరిక్, జన ఔషధి కేంద్రాలు తీసుకొచ్చారని సత్యకుమార్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖ, అమలాపురం, నరసరావుపేట, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, కర్నూలు లలో కార్యాలయ భవనాలు.. విశాఖ, కర్నూలులో డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లను మంత్రి సత్యకుమార్ వర్చువల్గా ప్రారంభించారు.
‘పూర్తయిన భవనాలు మొంథా తుఫాను కారణంగా ప్రారంభించలేకపోయాం. డ్రగ్ రెగ్యలేటరీ సర్వీసులు, ఆరోగ్య విధానాలు బలోపేతం చేయడానికి కేంద్రం నిధులు విడుదల చేసింది. గత ప్రభుత్వంలో భవన నిర్మాణాలు నత్తనడకన నడిచాయి. ఇప్పుడు భవనాల నిర్మాణం పూర్తవుతోంది. ప్రభుత్వానికి నెలకు 15 లక్షల అద్దె కలిసొస్తుంది. 16600 డ్రగ్ శాంపిల్స్ సంవత్సరానికి టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ చేస్తున్న 4 వేల శాంపిల్స్ చేస్తున్నాం, పూర్తయిన ల్యాబ్లతో మరో 3 వేల శాంపిల్స్ టెస్టింగ్ చేస్తాం. ఇంకా కొన్ని టెస్టింగ్ ల్యాబొరేటరీలు పూర్తయితే మరో 10 వేల శాంపిల్స్ టెస్టింగ్ చేయగలుగుతాం. ఆరోగ్యం బాగుపడేలా పటిష్ఠ వ్యవస్ధను తీర్చి దిద్దాలి. సిబ్బంది కొరత కూడా ఉంది.. దాదాపు 83 మంది వరకూ అనలిస్టులు కావాల్సి ఉంది. ఏపీపీఎస్సీ ద్వారానే కాకుండా రెగ్యులర్ విధానంలోనూ నియామకాలు చేపట్టాలని ఫైనాన్స్ ను కోరాం. టెక్నాలజీని అనుసంధానం చేసుకుని మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
Also Read: CM Chandrababu: వాజ్పేయ్ అజాత శత్రువు.. ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారు!
‘ఫార్మా హబ్గా తయారవుతున్న ఏపీలో డ్రగ్ కంట్రోల్ యాక్ట్ బలంగా ఉంది. ప్రధాని మోడీ ప్రభుత్వంలో జనరిక్, జన ఔషధి కేంద్రాలు తీసుకొచ్చారు. ఎక్స్పైరీ మందులు, నిషేధించిన మందులు కూడా దొరుకుతున్నాయి. డ్రగ్స్ పని చేయనివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి, నాకే అలాంటి పరిస్ధితి ఎదురైంది. డ్రగ్స్ పైన నిఘా పెట్టాలి, ఈగల్ ఉందని డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆగాల్సిన పని లేదు. డ్రగ్ కంట్రోల్ అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆకస్మిక తనిఖీలలో 97% లోపాలున్నాయి. అంటే.. అధికారులలోనూ లోపాలున్నాయి. చిన్న నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణం పోకూడదు. డ్రగ్ కంట్రోల్ అధిలారులు ప్రజారోగ్య రక్షణ ముఖ్యంగా పని చేయాలి. నిషేధిత మందులు, జనరిక్ మెడిసిన్ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాల్సి ఉంది. డాక్టర్ ఇచ్చే మందుల చీటీ లేకుండా అమ్మకాలు జరిగితే కఠిన చర్యలుంటాయి’ అని మంత్రి సత్యకుమార్ వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!