AP Farmers: ఓవైపు తుఫాన్లు, మరోవైపు ధరలు.. అల్లాడిపోతున్న రైతులు!
- ఓవైపు తుఫాన్లు, మరోవైపు ధరలు
- అల్లాడిపోతున్న ఆంద్రప్రదేశ్ రైతులు
- రైతులకు అసలైన పోరాటం ధాన్యం అమ్ముకోవడం
చెప్పింది కొండత… చేసేది గోరంత అన్నట్లుగా మారింది ధాన్యం కొనుగోలు పరిస్థితి. వరి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం.. వెంటనే డబ్బులు రైతుల ఖాతాలో జమచేస్తున్నామంటున్నారు. కానీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో రైతులు పంటను వ్యాపారులకు అయినకాడికి పంటను అమ్ముకుంటున్నారు. బస్తాధాన్యం 1300కే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి క్లిష్టంగా మారింది. ఒక వైపు అనిశ్చితమైన వాతావరణం దిగుబడులను దెబ్బతీయగా.. మరోవైపు మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దాంతో రైతులు రెండు దెబ్బలు ఒక్కసారిగా తిన్నట్లయ్యింది. ప్రభుత్వం మద్దతు ధర ఉన్నప్పటికీ.. టోకెన్లు, తేమ శాతం, నిబంధనలు ఇలా వరుస షరతులతో రైతులు తమ పంటను అమ్ముకునే అవకాశం లేక అల్లాడిపోతున్నారు.
Also Read
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
Also Read: Alluri Agency Shock: అల్లూరి ఏజెన్సీలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి!
కోత జరిగిన వెంటనే ధాన్యం తీసుకోలేమంటూ కేంద్రాలు తిరస్కరించడం రైతుల పరిస్థితిని మరింత కఠినంగా మారుస్తోంది. పంట పండించడం ఒకటి అయితే.. ఆ పంటను గోదాములకు చేర్చడం, సరైన ధరకు అమ్ముకోవడం మాత్రం రైతుల అసలైన పోరాటంగా మారిందని అవనిగడ్డ వరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదురొంటున్నారు. ప్రభుత్వం మాత్రం ధాన్యం త్వరిగతిన కొనుగోలు చేస్తాం అని చెబుతున్నా.. ఆ దిశగా మాత్రం చర్యలు మాత్రం జరగడం లేదు. మొంథా, దిత్వా తుఫాన్లు రైతులను నిండా ముంచాయి.
తాజావార్తలు
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో