ఇవాళ టిడిపి మహానాడు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహానాడు కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతారు..? అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ? కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,27,390 కు చేరింది. ఇందులో 14,24,859 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,92,104 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 99…
వైసీపీకి చెందిన దళిత కార్యకర్తను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హత్యాయత్నం చేశారు. అరాచకాలు చేస్తోన్న బీసీ జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టకూడదా అని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది చంద్రబాబు పాలన కాదు జగన్ పాలన అనేది గుర్తుంచుకోవాలి. అరాచకం చేసిన బీసీ జనార్దన్ రెడ్డిని చంద్రబాబు వెనకేసుకు రావడం సబబా..? చంద్రబాబుకు చెంచాడు సిగ్గు లేదు.. చారెడు ఎగ్గు లేదు అని పేర్కొన్నారు. కోవిడ్ కష్ట కాలంలో చంద్రబాబు హైదరాబాదులో…
బ్లాక్ ఫంగస్ మందుల పై సీఎం జగన్ మాట్లాడుతూ.. బ్లాక్ ఫంగస్ కు వాడే ఇంజక్షన్లు చాలా కొరతగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వీటి కొరత ఉంది అని అన్నారు. ఒక్కో రోగికి వారానికి కనీసంగా 50 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి మనకు 3వేల ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయి. మరో 2వేల ఇంజక్షన్లు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీకూడా సరిపోని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నాం. వీలైనంత మేర ఇంజక్షన్లు తెప్పించడానికి గట్టిగా…
ప్రైవేటు హాస్పిటళ్ళ దందా పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆరోగ్య శ్రీ కింద ఉచిత చికిత్సల విషయంలో కృష్ణాజిల్లా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఆస్పత్రుల్లో కచ్చితంగా 50శాతం బెడ్లు కచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లుకు ఇవ్వాలి. వివిధ బీమా సంస్థల రేట్లతో పోలిస్తే.. మన ప్రకటించిన రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రకటించిన రేట్లకు కచ్చితంగా రోగులకు సేవలు అందాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నియంత్రణ, నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి అన్నారు. ఆరోగ్య మిత్రలు, సీసీ కెమెరాలు…
శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించాం అని శ్రీకాకుళం.జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. రిమ్స్ లో స్పెషల్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. తీవ్రత ఎక్కువ ఉన్నవారికి మాత్రమే యాంపోటెరిసిన్ వాడుతున్నాం. బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కు కావాల్సిన మెడిసిన్ అందుబాటులో ఉంది అన్నారు. అవసరం మేరకు ప్రభుత్వం నుంచి మందులు సప్లై ఉన్నాయి. ఆపరేషన్ అవసరమైతే చికిత్స చేయించేందుకు నిపుణులతో మాట్లాడుతున్నాం. అందుకు కావాల్సిన ఏర్పాట్లు రిమ్స్ , జెమ్స్ లో…
యాస్ తుపాన్ ప్రభావిత జిల్లాల జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసారు మంత్రి ఆళ్ల నాని. తుపాన్ కదలికలపై ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి ఆళ్ల నాని… విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాల DMHO లు DCHS, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ ముందుగా సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి…
విశాఖపట్నం హెచ్పీసీఎల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు హోంమంత్రి సుచరిత. ప్రమాద సంఘటన గురించి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన హోం మినిస్టర్… సహాయకచర్యలు చేపట్టాలని ఫైర్ పోలీసు అధికారులను ఆదేశించారు. హెచ్పీసీఎల్ లోని ఫైర్ ఐదు ఇంజెన్స్ తో పాటు మరో 7 అదనంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. హెచ్పీసీఎల్ లో పాత టెర్మినల్ లో ప్రమాదం జరిగినట్లు హోంమంత్రి కి వివరించారు అధికారులు. ప్రమాదం సంభవించిన వెంటనే సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించినట్లు తెలిపారు.…
ఆనందయ్య మందు పై పరిశోధన వేగవంతం చేసారు తిరుపతి ఆయుర్వేద వైద్యులు. 18 మంది వైద్యులు, 32 మంది పిజి విధ్యార్దులుతో పరిశోధన జరుపుతున్నాం అని ఆయుర్వేద ప్రిన్సిపాల్ మురళిక్రిష్ణా తెలిపారు. సిసిఆర్ఏఏస్ ఆదేశాలు మేరకు మందు వేసుకున్న 500 మంది వివరాలు సేకరిస్తూన్నాం. విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధన జరుగుతుంది. ఏక్కువ మంది ముందస్తూగా మందును వేసుకున్నారు. అదనంగా మరో 200 మంది వివరాలను అందించాలని జిల్లా యంత్రాగాని కోరాం. ఇవాళ రాత్రికి సిసిఆర్ఏఏస్ కి…
ఆనందయ్య మందు పంపిణీ ఎవరు అడ్డుకున్నా దుర్మార్గం. ఆనందయ్య తో బలవంతంగా మందు తయారు చేయించి వైసీపీ ఎమ్మెల్యేలు వారికి కావాల్సిన తెలంగాణ వ్యాపారస్తులకు పంచుకుంటున్నారు అని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కృష్ణపట్నం వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆనందయ్య ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు…ఆయన్ని ప్రజలు కాపాడుకుంటారు. సెకండ్ ఫేజ్ లో ప్రజలు చనిపోతుంటే….ఆనందయ్య మందుకి కోవిడ్ థర్డ్ ఫేజ్ లో అనుమతి ఇస్తారా……