తెలుగు రాష్ట్రల్లో వర్షాలు ఇప్పుడు కాస్త తగ్గాయి. అలాగే ఎగువ నుండి కూడా వరద కూడా రాకపోవడంతో శ్రీశైలం జలాశయంకి వచ్చిన వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో మరియు ఔట్ ఫ్లో మాత్రం 21,189 గా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 820 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 40.8748 టీఎంసీలు ఉంది. ఇక ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కానీ కుడి గట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ప్రారంభం కాలేదు. అయితే నేటి నుండి శ్రీశైలం జలాశయంపైకి సందర్శకుల అనుమతి నిరాకరించారు. తెలుగురాష్ట్రాల మధ్య జలజగడం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక జలాశయం వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల భద్రత కొనసాగుతుంది.