Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- 2016కు ముందు తయారైన కొన్ని వాహనాలకు మాత్రమే స్వల్ప మార్పులు అవసరం.
- ఇంజిన్లో ఎలాంటి మార్పులు అవసరం లేదని అధ్యయనాలు వెల్లడి.
- రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు మాత్రమే మార్చాల్సి రావొచ్చు.
- E20 పెట్రోల్పై సమాధానం ఇచ్చిన నితిన్ గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: E20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) పెట్రోల్పై దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2005 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారత్ స్టేజ్-III (BS-III) ప్రమాణాల కింద తయారైన, 2016కు ముందు ఉత్పత్తి చేసిన కొన్ని వాహనాల్లో రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లను మార్చాల్సి రావొచ్చని చెప్పారు.
అయితే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, E20 పెట్రోల్ వినియోగానికి కార్లు, టూవీలర్ల ఇంజన్లలో ఎలాంటి మార్పులు అవసరం లేదని స్పష్టం చేశారు. పాత వాహనాలపై కూడా చేసిన అధ్యయనాల్లో పనితీరులో గణనీయమైన మార్పు, సమస్యలు లేవని గడ్కరీ వెల్లడించారు. డైవబిలిటీ, స్టార్టబిలిటీ, లోహాలు, ప్లాస్టిక్ భాగాల అనుకూలత వంటి అంశాల్లో కూడా ఎలాంటి సమస్యలు గుర్తించలేదని చెప్పారు.
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
2016కు ముందు తయారైన కొన్ని BS-III వాహనాల్లో మాత్రమే రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు మార్చాల్సి రావచ్చని, వీటిని సాధారణ సర్వీసింగ్ సమయంలోనే సులభంగా మార్చొచ్చని తెలిపారు. E20 పెట్రోల్ వల్ల మాత్రమే మైలేజ్ తగ్గుతుందని చెప్పలేమని, వాహన పనితీరు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, ఆటోమొబైల్ తయారీ సంస్థలు, పరీక్షలు చేసిన సంస్థలు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. E20 పెట్రోల్పై శాస్త్రీయ అధ్యయనాలు, దశలవారీగా అమలు, అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే అమలు చేస్తున్నామని గడ్కరి చెప్పారు. బ్రెజిల్ వంటి దేశాల్లో దశాబ్ధాలుగా అధిక ఇథనాల్ బ్లెండెట్ ఇంధనాన్ని విజయవంతంగా వినియోగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
-
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
-
Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!