Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- 2016కు ముందు తయారైన కొన్ని వాహనాలకు మాత్రమే స్వల్ప మార్పులు అవసరం.
- ఇంజిన్లో ఎలాంటి మార్పులు అవసరం లేదని అధ్యయనాలు వెల్లడి.
- రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు మాత్రమే మార్చాల్సి రావొచ్చు.
- E20 పెట్రోల్పై సమాధానం ఇచ్చిన నితిన్ గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: E20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) పెట్రోల్పై దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2005 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారత్ స్టేజ్-III (BS-III) ప్రమాణాల కింద తయారైన, 2016కు ముందు ఉత్పత్తి చేసిన కొన్ని వాహనాల్లో రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లను మార్చాల్సి రావొచ్చని చెప్పారు.
అయితే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, E20 పెట్రోల్ వినియోగానికి కార్లు, టూవీలర్ల ఇంజన్లలో ఎలాంటి మార్పులు అవసరం లేదని స్పష్టం చేశారు. పాత వాహనాలపై కూడా చేసిన అధ్యయనాల్లో పనితీరులో గణనీయమైన మార్పు, సమస్యలు లేవని గడ్కరీ వెల్లడించారు. డైవబిలిటీ, స్టార్టబిలిటీ, లోహాలు, ప్లాస్టిక్ భాగాల అనుకూలత వంటి అంశాల్లో కూడా ఎలాంటి సమస్యలు గుర్తించలేదని చెప్పారు.
Also Read
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
- West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
- Tamil Nadu: చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే.. విమర్శలపై కౌంటర్
2016కు ముందు తయారైన కొన్ని BS-III వాహనాల్లో మాత్రమే రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు మార్చాల్సి రావచ్చని, వీటిని సాధారణ సర్వీసింగ్ సమయంలోనే సులభంగా మార్చొచ్చని తెలిపారు. E20 పెట్రోల్ వల్ల మాత్రమే మైలేజ్ తగ్గుతుందని చెప్పలేమని, వాహన పనితీరు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, ఆటోమొబైల్ తయారీ సంస్థలు, పరీక్షలు చేసిన సంస్థలు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. E20 పెట్రోల్పై శాస్త్రీయ అధ్యయనాలు, దశలవారీగా అమలు, అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే అమలు చేస్తున్నామని గడ్కరి చెప్పారు. బ్రెజిల్ వంటి దేశాల్లో దశాబ్ధాలుగా అధిక ఇథనాల్ బ్లెండెట్ ఇంధనాన్ని విజయవంతంగా వినియోగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
-
Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
-
Party Movie: అస్తిత్వాల అంతర్మథనం “పార్టీ”
-
CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!