ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజులు ఉండనున్నారు. ఇవాళ మధ్యాహ్నం బెంగుళూరు నుంచి నేరుగా పులివెందులకు జగన్ చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. Also Read: IND vs SA: పసలేని బ్యాటింగ్.. వైట్వాష్ దిశగా…
ప్రస్తుత రోజుల్లో చిన్న స్మార్ట్ఫోన్ దిరికితేనే.. జేబులో వేసుకుని పోతున్నారు జనాలు. కాస్త కాస్ట్లీ ఫోన్ దొరికితే ఊరుకుంటారా?.. గుట్టుచప్పుడు కాకుండా సైడ్ చేస్తారు. అందులోనూ ఐఫోన్ దొరికే.. మూడో కంటికి కూడా తెలియకుండా ఇంటికి తీసుకెళుతారు. అయితే అందరూ ఇలా ఉండరు. నూటికో, కోటికో ఒక్కరు మనసున్న మహారాజు కూడా ఉంటాడు. అందులో ఒకడే ఆంధ్రకు చెందిన ఆటో డ్రైవర్ స్వామి. తనకు కాస్ట్లీ ఐఫోన్ దొరికితే తిరిగిచ్చేశాడు. ప్రస్తుతం స్వామి పేరు సోషల్ మీడియాలో…
ఒక్కోసారి మనం చేసే ప్రయత్నాలకంటే.. ప్రత్యర్థులు చర్యలే మనకు కలిసి వస్తాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి అదే కలిసి వస్తోందా..? తమ నాయకుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు వైసీపీ ఆఫీస్పై దాడి చేసి.. ఎదుటి వారికి అవకాశం ఇచ్చారా? మొన్నటి వరకు సెగ్మెంట్ అంతా కూడా తెలియనివారిని…స్టేట్ మొత్తం తెలిసేలా చేశారా?, నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఘటనలు ఎవరికి కలిసివచ్చాయి?. వైసిపి గ్రాఫ్ ఎలా పెంచుకోవాలని… కొన్ని…
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ను ఎస్ఎస్సీ బోర్డు ఈరోజు విడుదల చేసింది. ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుండగా.. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. Also Read: YS Jagan: 9 పేజీలతో..…
సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ 9 పేజీలతో కూడిన లేఖ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని, KWDT–2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని పేర్కొన్నారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. ఈ…
కర్నూలు జిల్లా ఆలూరు పీఎస్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మందుబాబు పోలీసు జీపును దర్జాగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలూరులో బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పెద్దహోతూరు యువరాజు పట్టుబడ్డాడు. తన బైక్ ఇవ్వాలని, ఇంటికి వెళ్లి వస్తానని పోలీసులతో చెప్పాడు. బైక్ ఇవ్వకపోవడంతో వేరే బైక్ తీసుకుని వెళ్లాడు. ఇవాళ ఉదయం మళ్లీ బైక్ తీసుకువచ్చాడు. తన బైక్ ఇస్తే వెళ్లిపోతానని, లేకుంటే పోలీస్…
పిల్లల పెంపకంలో తల్లుల పాత్ర అత్యంత కీలకం అని నారా భువనేశ్వరి అన్నారు. చిన్నతనంలోనే విలువలు, సంస్కారం పిల్లలకు నేర్పాలని చెప్పారు. పిల్లల ఆసక్తిని గుర్తించి.. ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. తన కుమారుడు, మంత్రి నారా లోకేష్ ప్రజాసేవలో బిజీగా ఉండటంతో.. దేవాన్ష్ చదువు, క్రీడలను బ్రాహ్మణి చూసుకుంటోందన్నారు. గతంలో రాజకీయాల్లో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు కారణంగా లోకేష్ పెంపకం బాధ్యత తాను తీసుకున్నాను అని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. కుప్పం సామగుట్లపల్లి మండల పరిషత్…
వానాకాలం ముగిసి శీతాకాలం ఎంటర్ అయినప్పటికి వరుణుడు మాత్రం వదలనంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం మొంథా తుఫాన్ ఏపీ, తెలంగాణలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లాయి. భారీ వరదలతో లోతట్టు ప్రాంత్రాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆ తుఫాన్ ప్రభావం వీడి రోజులు గడవకముందే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బయపెడుతోంది. Also Read:Andhra Pradesh:విశాఖలో మేనేజ్…
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు స్పీకర్ చింతకాయల ఆయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. ఆక్రమించిన స్థలాల్లో లే అవుట్స్ వేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రిని స్పీకర్ ప్రశ్నించారు. స్టేజ్ల మీద ఉపన్యాసాలు ఇస్తే కుదరదని, నియంత్రణ ఉండాలన్నారు. పదవులు, అధికారం శాశ్వతం అని ఎవరు అనుకోవద్దని.. మన హయాంలో ఏం చేశామో అదే ముఖ్యం అని పేర్కొన్నారు. ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దని స్పీకర్ ఆయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరడ్కో ప్రాపర్టీ షోలో…
దేశానికి గ్రోత్ ఇంజన్గా ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్గా విశాఖ తయారవుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా చేస్తున్నారన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామన్నారు. ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే వాటిని ప్రభుత్వ పెట్టుబడులుగా భావించి వారందరికీ అండగా నిలుస్తున్నామని…