Jogi Ramesh: మీ రాక్షస ఆనందం తీరిందా?.. దమ్ముంటే వచ్చి ప్రమాణం చేయండి!
- మూడు జైళ్లలో నన్ను ఇబ్బంది పెట్టారు
- దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని చెప్పాను
- రాక్షసానందం పొందడానికే చంద్రబాబు అరెస్ట్ చేయించారు
- నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన భయపడతానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు జైళ్లలో తనను ఇబ్బంది పెట్టారని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ చెప్పారు. దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని చెప్పానని, లై డిటెక్టర్ పరీక్షలు చేయమని చెప్పానని, తిరుమలలో ప్రమాణం చేస్తానని చెప్పాను అని తెలియారు. రాక్షసానందం పొందడానికే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తనను అరెస్ట్ చేయించారన్నారు. 3 నెలల పాటు తనను జైల్లో పెట్టినంత మాత్రాన భయపడతానా? అని.. వైసీపీ కార్యకర్తలు భయపడతారనుకుంటే పొరపాటు అని జోగి రమేష్ చెప్పుకొచ్చారు. 85 రోజులకు పైగా విజయవాడ జైలులో ఉన్న జోగి సోదరులు ఈరోజు బెయిల్ పై రిలీజ్ అయ్యారు.
జైలు నుంచి విడుదల అయిన వైసీపీ నేత జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ‘నన్ను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారు. ఇష్టం వచ్చినట్లుగా జైళ్ల చుట్టూ తిప్పారు. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాను. అంతకముందు పది మీడియా సమావేశాల్లో సీబీఐ విచారణ వేయాలని చెప్పా. లేదా నార్కో ఎనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు సిద్దం అని చెప్పా. సీఎం చంద్రబాబు ఇంటికి అయినా వచ్చి చర్చిస్తా అని అడిగా. దుర్గమ్మ సాక్షిగా తప్పు చేయలేదని, చర్చకు రావాలని సవాల్ చేశా. అయినా కుట్రతో నన్ను అరెస్టు చేయించారు. చంద్రబాబు కూర్చో అంటే కూర్చుంటారు.. నిలుచో అంటే నిలుచుంటారు సిట్ అధికారులు. మీకు పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. అన్యాయంగా కేసులు పెడితే పైన భగవంతుడు శిక్షిస్తాడని చెప్పా. అయినా రాక్షస ఆనందం కోసం అరెస్టు చేసి 83 రోజుల పాటు నన్ను, నా సోదరుడిని జైల్లో పెట్టారు’ అని జోగి రమేష్ అన్నారు.
Also Read
- BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
- Shehbaz Sharif: భారత్పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
- BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్లో రోడ్డెక్కిన యువత
Also Read: KTR-Phone Tapping Case: విచారణలో నేను తప్ప ఏ రావు లేడు.. వేధింపులు తప్ప ఏమీ లేదు!
‘మూడు నెలలు నన్ను జైల్లో ఉంచినందుకు మీ రాక్షస ఆనందం తీరిందా? అని అడుగుతున్నా. కేసులు పెడితే వైసీపీ నాయకులు భయపడతారని అనుకుంటున్నారా?. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఫేక్ సీఎం.. అన్నీ డ్రామాలు. మా లీడర్ వైఎస్ జగన్ సారథ్యంలో ముందుకు వెళతాం. చంద్రబాబు, నా లోకేష్లకు భయపడే వ్యక్తులం కాదు. రేపు అమ్మవారి గుడికి వెళుతున్నా. తప్పు చేయలేదని ప్రమాణం చేస్తాం, మంత్రి లోకేష్కు దమ్ముంటే వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేస్తున్నా’ అని వైసీపీ నేత జోగి రమేష్ ఛాలెంజ్ విసిరారు. మైలవరం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో జోగి రమేష్ సోదరులకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. బాణా సంచాలు కాల్చి మైలవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇంటికి చేరుకున్న జోగి రమేష్కు కుటుంబ సభ్యులు హారతితో స్వాగతం పలికారు. ఆయన సతీమణి శంకుతల ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
-
Shehbaz Sharif: భారత్పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
ట్రెండింగ్
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!