Bill Gates Flight Delay: బిల్గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్లో ఇబ్బందులు.. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం!
- బిల్గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్లో ఇబ్బందులు
- విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం
- పొగమంచు కారణంగా విజిబిలిటీ సమస్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bill Gates Flight Faces Landing Trouble in Vijayawada Due to Fog: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్ ఈరోజు అమరావతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అమరావతి పర్యటన కోసం సోమవారం ఉదయం బిల్గేట్స్ స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే బిల్గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయవాడ ఎయిర్పోర్ట్లో పొగమంచు కారణంగా విజిబిలిటీ సమస్య ఎదురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా విజయవాడ చుట్టూ బిల్గేట్స్ స్పెషల్ ఫ్లైట్ చక్కర్లు కొడుతోంది. పైలట్కు రన్వే స్పష్టంగా కనిపించకపోవడం వల్ల విమానాన్ని దింపడం సాధ్యపడలేదు.
అధికారుల సమాచారం ప్రకారం.. బిల్గేట్స్ విమానం విజయవాడ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో గాల్లోనే చక్కర్లు కొడుతోంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు విమానం వేచి ఉండాల్సిందే. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ పైలట్కు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. విజిబిలిటీ స్థాయి సురక్షిత ల్యాండింగ్కు సరిపడేంతగా మెరుగుపడిన తర్వాతే.. బిల్గేట్స్ స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అధికారులు అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరిస్థితిని సమర్థంగా నిర్వహిస్తున్నారు.
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
బిల్గేట్స్ ఈరోజు అమరావతిలో పర్యటించనున్నారు. గేట్స్ ఫౌండేషన్కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం సచివాలయానికి రానుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్లు బిల్గేట్స్తో సమావేశమవుతారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. ఆర్టీజీఎస్ విధానాలు, సాధిస్తున్న ఫలితాల్ని గేట్స్కు సీఎం వివరిస్తారు. అనంతరం బిల్గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం అవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!