APSRTC: మరోసారి అద్దె బస్సుల యజమానులతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సమావేశం!
- మరోసారి అద్దె బస్సుల యజమానులతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సమావేశం
- భారీ ఆశలు పెట్టుకున్న అద్దె బస్సుల యజమానులు
- స్పష్టమైన నిర్ణయం రాకపోతే మరోసారి సమ్మె బాట పట్టే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో ఇవాళ మరోసారి అద్దె బస్సుల యజమానులతో ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు చర్చలు జరిగినప్పటికీ ప్రధాన డిమాండ్లపై ఎలాంటి తుది నిర్ణయం వెలువడకపోవడంతో.. ఈ సమావేశంపై అద్దె బస్సుల యజమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా MSTC–1, 2, 3, 4 టెండర్లలో పాల్గొన్న హైర్ బస్సుల యజమానుల డిమాండ్లే చర్చల కేంద్రబిందువుగా మారాయి. ‘స్త్రీశక్తి’ పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల బస్సులపై మెయింటెనెన్స్ భారం గణనీయంగా పెరిగిందని హైర్ బస్సుల ఓనర్లు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా నిబంధనల్లో మార్పులు అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు.
మైలేజీ అంశంలో కూడా ఇరువర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ 1.8 KMPL వరకు అంగీకరించేందుకు సిద్ధంగా ఉండగా, హైర్ బస్సుల యజమానులు కనీసం 2.5 KMPL కావాలని పట్టుబడుతున్నారు. అలాగే హైర్ బస్సుల డ్రైవర్లకు చెల్లించే జీతాలు కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల డ్రైవర్లకు సమానంగా ఉండాలని వారు కోరుతున్నారు. మూడు వేర్వేరు అసోసియేషన్లు ఉండటం వల్ల టెండర్ కాలంలో అనేక ఇబ్బందులు తలెత్తాయని యజమానులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఓవర్లోడ్ సమస్యపై స్పష్టమైన, నిర్దిష్ట నిర్ణయం తీసుకుంటేనే మిగతా అంశాలపై చర్చ కొనసాగిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. బస్సుల్లో ఎంతమందిని అనుమతించాలి, అలాగే నిర్దిష్ట స్టేజీలపై స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన లేఖను జారీ చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
Also Read: Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు!
పాయింట్ల వ్యవస్థలో మార్పులు చేయాలని కూడా హైర్ బస్సుల యజమానులు కోరుతున్నారు. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులకు 0.50 పాయింట్లు, సిటీ ఆర్డినరీ సర్వీసులకు 0.65 పాయింట్లుగా మార్చాలని సూచిస్తున్నారు. అలాగే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ‘స్త్రీశక్తి’ కారణంగా ఓఆర్ (ఓవర్ రన్నింగ్) పెరిగి బస్సుల తరుగుదల కూడా ఎక్కువైందని యజమానులు వాపోతున్నారు. ఈ అన్ని అంశాలపై ఇవాళ జరిగే ఎండీ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం రాకపోతే మరోసారి సమ్మె బాట పట్టే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ఏపీఎస్ఆర్టీసీకి, అద్దె బస్సుల యజమానులకు కీలకంగా మారింది.
తాజావార్తలు
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!