Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Naidu Promises Krishna Water To Nagari Pledges Industrial Development

CM Chandrababu: నగరి టీడీపీకి కంచుకోట.. తప్పకుండా కృష్ణా జలాలు అందిస్తాం!

Published Date :January 24, 2026 , 3:59 pm
By Sampath Kumar
  • నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన
  • సూపర్‌ సిక్స్‌లను సూపర్‌ హిట్‌గా అమలు చేసి చూపించాం
  • ఐదేళ్లలో ఏపీని నంబర్‌ వన్‌ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం
CM Chandrababu: నగరి టీడీపీకి కంచుకోట.. తప్పకుండా కృష్ణా జలాలు అందిస్తాం!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తాను చాలాసార్లు సీఎం అయ్యానని, ఎప్పుడూ ఇంతలా అభివృద్ధి చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నగరి టీడీపీకి కంచుకోట అని, వచ్చే ఎన్నిక నాటికి నగరికి కృష్ణ జలాలు అందిస్తాం అని హామీ ఇచ్చారు. కోసల నగరాన్ని పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తాం అని, నగరి యువతకు ఉపాది ఇక్కడే కల్పిస్తాం అని చెప్పారు. సూపర్‌ సిక్స్‌ ప్రకటిస్తే అసాధ్యం అన్నారని, సూపర్‌ సిక్స్‌లను సూపర్‌ హిట్‌గా అమలు చేసి చూపించామని చెప్పారు. పెన్షన్లు, తల్లికి వందనం సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో ఏపీని నంబర్‌ వన్‌ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఈరోజు చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ… ‘చెడు చేసిన వ్యక్తిని ఎప్పుడూ మరచిపోకూడదు. 2024కు ముందు రాష్ట్రం అతలాకుతలం అయ్యుంది. నోటీసులు కూడా ఇవ్వకుండా నన్ను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. ఐదేళ్లుగా కనీసం మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి, నవ్వాలన్నా నవ్వలేకపోయారు, అంత భయంకరమైన పాలన ఐదేళ్లు సాగింది‌. ఒక రాక్షస పరిపాలన ఐదేళ్లు సాగింది. మూడు పార్టీలు కలసి రాష్ట్ర కోసం పనిచేసాం. చాలాసార్లు సీఎం అయ్యా కానీ.. ఎప్పుడూ ఇంతలా అభివృద్ధి నేను చేయలేదు‌. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు.. మన జీవన విధానం కావాలి. మనం పీల్చే గాలి, మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read

  • Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.
  • Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
  • Bengal's Next CM: బెంగాల్‌లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
  • Vijay-Governor: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్
Add as a preferred
source on google

Also Read: Chiranjeevi Hits: రీ-ఎంట్రీలో చిరంజీవి హిట్స్.. ఈ ఆసక్తికర విషయం తెలుసా?

‘భూ సమస్యలు గత ఐదేళ్లుగా భూతంలా పట్టిపీడించాయి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. పట్టాదారు పాసు పుస్తకంపై ప్రభుత్వ రాజముద్రతో అందిచాం. నాఫోటో, ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటో ఉందా‌. వైఎస్ జగన్ ఎమైనా గోప్పోడా‌‌ ఫోటో వేసుకోవడానికి. మీ భూమీని సర్వే చేసి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఫోటోలు చేసుకున్నాడు. శాశ్వతంగా మీ పోలంలో ఉండాలనుకున్నాడు‌ కానీ.. మీరు వద్దని తరిమేశారు. మా నాయనతో పనిచేశాడు‌, నాతో పోటీపడలేకున్నాడని ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నాడు. అలాంటి చెత్త పనులు నేను చేయాలా?. వచ్చే ఎన్నిక నాటికి నగరికి కృష్ణా జలాలు అందిస్తాం. కోసల నగరాన్ని పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తాం. నగరి యువతకు ఉపాది ఇక్కడే కల్పిస్తాం. అమరావతిని శ్మశానం అని మూడు ముక్కల ఆట ఆడారు‌. నామీద నమ్మకంతో మీరు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. ఎంతమంది అడ్డుకున్నా అమరావతి రాజధానిగా ఉంటుంది..శాశ్వతంగా ప్రపంచం మెచ్చే రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. దేవుడు ఒక్కొక్కరికి ఓ అవకాశం ఇస్తాడు‌. అప్పుడు హైదారాబాద్, ఇప్పుడు అమరావతి.. నాకు దేవుడు ఇచ్చిన అవకాశం’ అని సీఎం చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Chandrababu Nagari Visit
  • cm chandrababu
  • CM Chandrababu Speech
  • Krishna water

తాజావార్తలు

  • Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.

  • Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.

  • MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!

  • Bengal’s Next CM: బెంగాల్‌లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..

  • Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions