Master Plan Corruption: అవినీతికి మాస్టర్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్కే మాస్టర్ ప్లాన్ వేశారు అక్కడి అవినీతి అధికారులు. చెప్పింది చేస్తే నాకేంటి..? అని సూటిగా సుత్తిలేకుండా అడిగేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడానికి తమలోని మాటకారితనాన్ని బయటకు తీస్తున్నారు మాయగాళ్లు.
‘మాకేంటి..!?’ అని సిగ్గులేకుండా అడిగేస్తున్నారా?
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతికి ఈ సీన్ అతికినట్టు సరిపోతుంది. మున్సిపల్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోని కొందరు అధికారులకు మాస్టర్ప్లాన్ కాసులు కురిపిస్తోంది. ప్లాన్పై అభ్యంతరాలు చెప్పే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు అక్కడి మాయగాళ్లు. మీరు చెప్పినట్టు మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తాం.. అయితే మాకేంటి..? అని సిగ్గులేకుండా అడిగేస్తున్నట్టు చెబుతున్నారు బాధితులు.
ప్రజల అభ్యంతరాలే ఆసరా..!
రాబోయే రెండు దశాబ్దాల్లో చిత్తూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ 2041 రూపొందించారు. ఆ ప్లాన్ ముసాయిదాను గత ఏడాది అక్టోబర్ 11న ప్రచురించారు. గృహ అవసరాలు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల ఏర్పాటు, బఫర్ జోన్, మిక్స్డ్ జోన్ ఎక్కడ ఉండాలో ప్లాన్లో పొందుపర్చారు. నగరంలోని 50 డివిజన్లలో జోన్ల వారీగా ఉన్న ప్రాంతాలను ప్రస్తావించి.. ప్రజల అభ్యంతరాలను కోరారు అధికారులు.
రోడ్డు రాకుండా ఉండాలంటే పైకం ఇవ్వాల్సిందే..!
ముసాయిదాపై కార్పొరేషన్కు 117, చుడాకు 145 అభ్యంతరాలు వచ్చాయి. నివాసిత ప్రాంతంలో రోడ్డు ప్రతిపాదించారని కొందరు.. పంట పొలాల్లో రింగు రోడ్డు చూపించారని మరికొందరు రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలిపారు. ఈ అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన కొందరు అధికారులు వసూళ్ల పర్వం చేపట్టారని ఆరోపణ. మీ స్థలంలో రోడ్డు రాకుండా ఉండాలంటే.. ఎంత సమర్పించుకోవాలో మొహమాటం లేకుండా అడిగేస్తున్నట్టు సమాచారం. ఈ విధంగా భారీ మొత్తంలోనే వెనకేసుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు జనం.
ఎమ్మెల్యే హెచ్చరికలు భేఖాతర్
అవినీతి అధికారుల బేరసారాలను కొందరు బాధితులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులైన అధికారులను ఆయన హెచ్చరించినట్టు సమాచారం. కానీ.. ఎమ్మెల్యే వార్నింగ్స్ చెల్లుబాటు కావడం లేదని తెలుస్తోంది. అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారి నుంచి ఓ రేంజ్లో పిండేస్తున్నట్టు టాక్. ఇప్పుడీ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లినట్టు చెబుతున్నారు. మరి.. వారైనా పరిస్థితిని చక్కదిద్దుతారో లేక.. వసూలు చేసిన దాంట్లో వాటా అడుగుతారో చూడాలి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!