Master Plan Corruption: అవినీతికి మాస్టర్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్కే మాస్టర్ ప్లాన్ వేశారు అక్కడి అవినీతి అధికారులు. చెప్పింది చేస్తే నాకేంటి..? అని సూటిగా సుత్తిలేకుండా అడిగేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడానికి తమలోని మాటకారితనాన్ని బయటకు తీస్తున్నారు మాయగాళ్లు.
‘మాకేంటి..!?’ అని సిగ్గులేకుండా అడిగేస్తున్నారా?
Also Read
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతికి ఈ సీన్ అతికినట్టు సరిపోతుంది. మున్సిపల్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోని కొందరు అధికారులకు మాస్టర్ప్లాన్ కాసులు కురిపిస్తోంది. ప్లాన్పై అభ్యంతరాలు చెప్పే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు అక్కడి మాయగాళ్లు. మీరు చెప్పినట్టు మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తాం.. అయితే మాకేంటి..? అని సిగ్గులేకుండా అడిగేస్తున్నట్టు చెబుతున్నారు బాధితులు.
ప్రజల అభ్యంతరాలే ఆసరా..!
రాబోయే రెండు దశాబ్దాల్లో చిత్తూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ 2041 రూపొందించారు. ఆ ప్లాన్ ముసాయిదాను గత ఏడాది అక్టోబర్ 11న ప్రచురించారు. గృహ అవసరాలు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల ఏర్పాటు, బఫర్ జోన్, మిక్స్డ్ జోన్ ఎక్కడ ఉండాలో ప్లాన్లో పొందుపర్చారు. నగరంలోని 50 డివిజన్లలో జోన్ల వారీగా ఉన్న ప్రాంతాలను ప్రస్తావించి.. ప్రజల అభ్యంతరాలను కోరారు అధికారులు.
రోడ్డు రాకుండా ఉండాలంటే పైకం ఇవ్వాల్సిందే..!
ముసాయిదాపై కార్పొరేషన్కు 117, చుడాకు 145 అభ్యంతరాలు వచ్చాయి. నివాసిత ప్రాంతంలో రోడ్డు ప్రతిపాదించారని కొందరు.. పంట పొలాల్లో రింగు రోడ్డు చూపించారని మరికొందరు రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలిపారు. ఈ అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన కొందరు అధికారులు వసూళ్ల పర్వం చేపట్టారని ఆరోపణ. మీ స్థలంలో రోడ్డు రాకుండా ఉండాలంటే.. ఎంత సమర్పించుకోవాలో మొహమాటం లేకుండా అడిగేస్తున్నట్టు సమాచారం. ఈ విధంగా భారీ మొత్తంలోనే వెనకేసుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు జనం.
ఎమ్మెల్యే హెచ్చరికలు భేఖాతర్
అవినీతి అధికారుల బేరసారాలను కొందరు బాధితులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులైన అధికారులను ఆయన హెచ్చరించినట్టు సమాచారం. కానీ.. ఎమ్మెల్యే వార్నింగ్స్ చెల్లుబాటు కావడం లేదని తెలుస్తోంది. అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారి నుంచి ఓ రేంజ్లో పిండేస్తున్నట్టు టాక్. ఇప్పుడీ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లినట్టు చెబుతున్నారు. మరి.. వారైనా పరిస్థితిని చక్కదిద్దుతారో లేక.. వసూలు చేసిన దాంట్లో వాటా అడుగుతారో చూడాలి.
తాజావార్తలు
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!