పోలీసులు ఎంతగా ప్రయత్నించినా నేరాలు అదుపులోకి రావడం లేదు. టెంపుల్ సిటీ తిరుపతి జిల్లా ఏర్పాటు జరిగిన రోజే…..లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. నూతనంగా తిరుపతి పట్టణంలో కలెక్టర్,ఎస్పీలు బాధ్యతలు స్వీకరించిన రోజే మందు బాబులు రెచ్చిపోయారు. పట్టపగలు అందరూ చూస్తూ వుండగానే తెగబడ్డారు. సాక్షాత్తు భద్రతను పర్యవేక్షించవలసిన పోలిసులు ప్రేక్షక పాత్ర పోషించారు. మద్యం మత్తులో ముగ్గురు కలసి ఒక యువకుడిని చితకబాదారు. అందరు అయ్యో పాపం వదిలెయ్యండి అని అంటున్నా వాళ్ళు పట్టించుకోలేదు.…
*నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి * నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎంపీలను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ * నేడు పాకిస్తాన్ స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టులో విచారణ * నేడు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పార్లమెంటరీ సమావేశం *ఐపీఎల్: నేడు రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ *నేడు యూకే ఆధ్వర్యంలో యూఎన్ఎస్ సీ సమావేశం. ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చ * నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.…
ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోయింది. 26 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపు సంతరించుకుంది. కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి రంగం పూర్తయింది. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. 9.05 – 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశారు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అయింది. చివరిసారిగా 1979 లో ఏర్పడింది విజయనగరం జిల్లా. పరిపాలన వికేంద్రీకరణ…
మునుపెన్నడూ లేని విధంగా సూరీడు మండిపోతున్నాడు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రంగా వుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇవాళ్టి నుంచి 4 రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నెలలో 122 ఏళ్ల ఉష్ణోగ్రతల రికార్డు బద్దలయ్యాయి. ఈ నెలలో తొలి 10-15 రోజులు ఎండలు మండిపోయే అవకాశం ఉందని, ఆదివారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి…
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశ,విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు చేరుకుంటుండగా, నడక మార్గం భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అత్యంత ప్రాచీనమైన శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. కలియుగ శ్రీనివాసుడు పై అపారమైన భక్తిభావంతో గోవిందనామాలు స్మరించుకుంటూ మొక్కుబడిగా మెట్టుమెట్టుకు నమస్కరించుకుంటూ వేల సంఖ్యలో భక్తులు పురాతన మార్గమైన నడకదారిలో…
సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన శ్రీలంక. దేశవ్యాప్తంగా వివిధ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం రేపటి నుంచి అమలులోకి రానున్న కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు పాకిస్తాన్ లో ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం. తేలనున్న భవితవ్యం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్. ఈరోజు మత్స్య జయంతి. ఇవాళ్టి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం. నేటితో…
టీడీపీ ఆవిర్భావ సభలో సంచలన కామెంట్లు చేసిన లోకేష్ గురించి తెలుగునాట చర్చ సాగుతోంది. గతంలో తనపై వచ్చిన విమర్శలు, తన మాటతీరుపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలను దాటుకుని తన స్టయిల్ మార్చేశారు చంద్రబాబు తనయుడు లోకేష్. తాను చంద్రబాబు తరహా కాదని.. మూర్ఖుడినన్నారు లోకేష్.తన మామ బాలయ్య బాబు డైలాగులతో ఆవిర్భావ సభలో ప్రసంగించిన లోకేష్ తీరుని చూసి క్యాడర్ అవాక్కవుతున్నారు. చినబాబు కెవ్వుకేక అంటున్నారు. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద రూ. 2…
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో జనం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. వీరికి ఎలక్ట్రిక్ బైక్ లు ఊరట నిస్తున్నాయి. ప్రారంభంలో ఖర్చు ఎక్కువే వున్నా.. రోజూ పెట్రోల్ బంకులకు వెళ్లే అవకాశం లేదు. ఒకసారి ఛార్జి చేస్తే వంద కిలోమీటర్ల వరకూ మైలేజ్ వస్తుంది. ఛార్జింగ్ పాయింట్లు కూడా అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ బైక్ ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, ఈ ఎలక్ట్రిక్ బైక్ లు అంత సేఫ్…
ఏపీలో జిల్లాల పునర్విభజన పై సీఎం జగన్ కీలక సమీక్ష. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టనున్న ముఖ్యమంత్రి జగన్. తుది మార్పులు చేర్పులతో సిద్ధం కానున్న ఫైనల్ డ్రాఫ్ట్ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన. వేములవాడ ,కొండగట్టు దేవాలయాల సందర్శన. పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాల్లో పాల్గొననున్న కేసీఆర్ మాసశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు. సాయంత్రం…
టీడీపీ పుట్టి 40 ఏళ్ళు అయ్యిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా సంబరాలు చేసుకోవడం లో తప్పు లేదు. 1995లో ప్రజా నిర్ణయంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ను గద్దె దించటం కూడా చూడాల్సిన కోణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఆవిర్భావం కూడా మీడియా మేనేజ్మెంట్ ఉంది. కానీ అప్పటి రాజకీయ అవసరం వేరు. అప్పుడు జర్నలిస్టుగా దగ్గరగా అన్ని పరిణామాలు చూసిన వాడిని. కానీ చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొక్కి పూర్తిగా వ్యవస్థలను…