Guntur Bank Scam: బ్యాంక్ మేనేజర్ వరలక్ష్మే ప్రధాన సూత్రధారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించిన బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తెనాలి జీడీసీసీ బ్యాంక్ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ నేతి వరలక్ష్మిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు బ్యాంకు ఉన్నతాధికారులు. ఉద్దేశ్య పూర్వకంగానే నకిలీ బంగారంతో రుణాలు ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు చర్యలను వేగవంతం చేశారు.
రూ.44 లక్షల బ్యాంకు సొమ్మును నిందితులనుండి రికవరీ చేశారు అధికారులు. బ్యాంక్ మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్ , క్యాషియర్ లపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. మరో వైపు క్రిమినల్ చర్యలకు సిద్దమౌతున్నారు బ్యాంకు అధికారులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు చేతి వాటం ఖాతాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. కంచె చేను మేసిన చందంగా బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకుల్నే మోసం చేస్తున్నారు. బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టు కొని దొంగ రుణాలు మంజూరు చేశారు బ్యాంక్ ఉద్యోగులు… చెంచుపేట జీడీసీసీ బ్యాంక్ మేనేజర్ తో పాటు మరో ఇద్దరు సిబ్బంది ఐదుగురు ఖాతాదారుల సాయంతో లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. ఆడిటింగ్ నిర్వహిస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి మొత్తం 29 అకౌంట్లలో 42లక్షల రూపాయలు లోన్ తీసుకున్న ట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు.
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
బ్రాంచ్ మేనేజర్,తో పాటు బంగారం తనఖా పెట్టుకునే అధికారి(అప్లైజర్) కుమ్మక్కయి రుణాలు మంజూరు చేసినట్టు విచారణలో తేలింది. మరికొన్ని అకౌంట్లలో తక్కువ నాణ్యత కలిగిన బంగారం పెట్టి ఎక్కువ డబ్బు రుణాలుగా పొందటం కొన్ని కేసుల్లో బంగారం విలువ కంటే ఎక్కువ డబ్బు రుణం పొందారు. అవసరం కోసం భద్రత కోసం బ్యాంక్ లో బంగారం పెడుతుంటే బ్యాంక్ సిబ్బంది ఇలా మోసాలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖాతా దారులు. బ్యాంకు అధికారుల ప్రమేయంతోనే నకిలీ బంగారం పెట్టి లక్షల సొమ్ము కాజేస్తున్నారు. నకిలీ బంగారంతో లక్షలు లోన్లు తీసుకున్నవారిని కఠినంగా శిక్షించాలని ఖాతాదారులు కోరుతున్నారు.
Guntur Gold Scams: గోల్డ్ స్కాంలతో బ్యాంక్ ఉద్యోగుల చేతివాటం
తాజావార్తలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!