Guntur Bank Scam: బ్యాంక్ మేనేజర్ వరలక్ష్మే ప్రధాన సూత్రధారి
గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించిన బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తెనాలి జీడీసీసీ బ్యాంక్ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ నేతి వరలక్ష్మిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు బ్యాంకు ఉన్నతాధికారులు. ఉద్దేశ్య పూర్వకంగానే నకిలీ బంగారంతో రుణాలు ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు చర్యలను వేగవంతం చేశారు.
రూ.44 లక్షల బ్యాంకు సొమ్మును నిందితులనుండి రికవరీ చేశారు అధికారులు. బ్యాంక్ మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్ , క్యాషియర్ లపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. మరో వైపు క్రిమినల్ చర్యలకు సిద్దమౌతున్నారు బ్యాంకు అధికారులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు చేతి వాటం ఖాతాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. కంచె చేను మేసిన చందంగా బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకుల్నే మోసం చేస్తున్నారు. బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టు కొని దొంగ రుణాలు మంజూరు చేశారు బ్యాంక్ ఉద్యోగులు… చెంచుపేట జీడీసీసీ బ్యాంక్ మేనేజర్ తో పాటు మరో ఇద్దరు సిబ్బంది ఐదుగురు ఖాతాదారుల సాయంతో లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. ఆడిటింగ్ నిర్వహిస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి మొత్తం 29 అకౌంట్లలో 42లక్షల రూపాయలు లోన్ తీసుకున్న ట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు.
Also Read
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
బ్రాంచ్ మేనేజర్,తో పాటు బంగారం తనఖా పెట్టుకునే అధికారి(అప్లైజర్) కుమ్మక్కయి రుణాలు మంజూరు చేసినట్టు విచారణలో తేలింది. మరికొన్ని అకౌంట్లలో తక్కువ నాణ్యత కలిగిన బంగారం పెట్టి ఎక్కువ డబ్బు రుణాలుగా పొందటం కొన్ని కేసుల్లో బంగారం విలువ కంటే ఎక్కువ డబ్బు రుణం పొందారు. అవసరం కోసం భద్రత కోసం బ్యాంక్ లో బంగారం పెడుతుంటే బ్యాంక్ సిబ్బంది ఇలా మోసాలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖాతా దారులు. బ్యాంకు అధికారుల ప్రమేయంతోనే నకిలీ బంగారం పెట్టి లక్షల సొమ్ము కాజేస్తున్నారు. నకిలీ బంగారంతో లక్షలు లోన్లు తీసుకున్నవారిని కఠినంగా శిక్షించాలని ఖాతాదారులు కోరుతున్నారు.
Guntur Gold Scams: గోల్డ్ స్కాంలతో బ్యాంక్ ఉద్యోగుల చేతివాటం
తాజావార్తలు
-
IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!