TDP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి టీడీపీ అండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ డెడ్ బాడీ లభించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు నారా లోకేష్. డ్రైవర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనంత బాబే హత్య చేశాడని జరిగిన ఘటన గురించి లోకేషుకి వివరించారు సుబ్రహ్మణ్యం తల్లి, భార్య.
మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న మాపై పోలీసులు దాడి చేశారని లోకేషుకు వివరించారు సుబ్రహ్మణ్యం భార్య. జరిగింది ఒక్కటైతే పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే విధంగా ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్న సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడ్ని అన్యాయంగా చంపేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. ఎమ్మెల్సీ అనంత బాబుని తక్షణమే అరెస్టు చేయాలి. జరిగింది ఒకటైతే కట్టు కథ అల్లి కేసును తప్పుదోవ పట్టిస్తూ, వైసీపీ ప్రజాప్రతినిధిని కాపాడే విధంగా పోలీసులు వ్యవహరించడం దారుణం.
Also Read
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం. మాకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని లోకేష్ తో సుబ్రహ్మణ్యం భార్య పేర్కొన్నారు. గత ఐదు ఏళ్లుగా అనంత బాబు దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు సుబ్రహ్మణ్యం. నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలు తో సుబ్రహ్మణ్యం డ్రైవర్ జాబ్ మానేశాడన్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీ పర్సనల్ విషయాలు డబ్బులు ఇవ్వకపోతే బయటకు చెప్పేస్తానని తరచు చెప్తున్నాడు సుబ్రహ్మణ్యం. ఈ వ్యవహారమే ఘటనకు కారణంగా భావిస్తున్నారు. మరోవైపు జిల్లా పరిషత్ దగ్గర దళిత సంఘాలు ఆందోళన, రాస్తారోకో చేస్తున్నాయి. జెడ్పీ సమావేశం జరుగుతుండగా నిరసన తెలుపుతున్నారు. ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు పోలీసులు.
మాజీ హోంమంత్రి చిన రాజప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. బాధితులను నిందితులు బెదిరిస్తున్నారు. ఎమ్మెల్సీ ని వెంటనే అరెస్ట్ చేయాలి. బాధితులకు టీ డీ పీ అండగా ఉంటుందని, వారి తరుపున పోరాటం చేస్తామన్నారు చినరాజప్ప.
తాజావార్తలు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..