ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ రచ్చ పతాక స్థాయికి చేరుకుంది. ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం విజయవాడలో టెన్షన్ వాతావరాణాన్ని నెలకొల్పింది. మరోవైపు ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించగా.. ఉద్యమం నిర్వహించి తీరుతామని పీఆర్సీ సాధన సమితి ప్రకటించింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల ఆంక్షలు విధించారు. ఛలో విజయవాడకు వస్తున్న ఉద్యోగులను ఎక్కడిక్కకడే పోలీసులు…
పీఆర్సీపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారిని నిర్భంధించే చర్యలు మానుకోవాలి. ముందస్తు నోటీసులిచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఉద్యోగ సంఘాలను నిర్భందించడం అంటే జగన్ తనను తానే నిర్భందించుకున్నట్లు అని ఆయన అన్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల…
ప్రభుత్వానికి మాట తప్పే జబ్బు.. మనస్సు మార్చుకునే జబ్బు వచ్చిందని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ కరోనా జబ్బు మమ్మల్నేం చేయలేదని, ప్రభుత్వానికి వచ్చిన జబ్బు కంటే కరోనా ఏం పెద్ద జబ్బు కాదని ఆయన వ్యాఖ్యానించారు. హడావుడిగా జీతాలు వేసేశారని, చనిపోయిన వారికీ జీతాలు వేసేశారని ఆయన అన్నారు. సీఎఫ్ఎంఎస్ తీసేయాలన్న మంత్రి బుగ్గన ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా మాకు జీతాలు వేస్తున్నారని, ఈ ప్రభుత్వానిదంతా రివర్సేనని ఆయన…
ఏపీలో పీఆర్సీపై ప్రభుత్వానికి, పార్క్ సాధన సమితికి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ సందర్బంగా పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… అశాస్త్రీయంగా.. అసంబద్దంగా పీఈర్సీ జీవోలు జారీ చేశారని అన్నారు. చర్చలు పూర్తయ్యాక కొత్త జీవోలు ఇవ్వాలని లిఖిత పూర్వకంగా చెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదని ఆయన మండిపడ్డారు. కొత్త జీతాలు వద్దంటూ ఉద్యోగులంతా రిక్వెస్ట్ లెటర్లు పెట్టారని, సస్పెండులో ఉన్న వాళ్లకి.. చనిపోయిన వాళ్లకు.. రిటైరైన వాళ్లకు జీతాలు వేసేశారని…
పీఆర్సీ సాధనకు ఉద్యోగులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. బుధవారం చేపట్టిన ఛలో విజయవాడను విజయవంతం చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. పోలీసులు వారిని నియంత్రించే పనిలో వున్నారు. ఈ నెల మూడో తేదీన ఛలో విజయవాడకు పీఆర్సీ సాధన సమితికి అనుమతి నిరాకరిస్తున్నామన్నారు విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా. ఛలో విజయవాడ నిర్వహణ చట్టపరంగా విరుద్దం.ఉద్యోగుల కాండాక్ట్ రూల్స్ ప్రకారం కూడా ఛలో విజయవాడ కార్యక్రమం చేయకూడదు. కరోనా నిబంధనల కారణంగా ఛలో విడయవాడకు అనుమతి…
ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ పై ఆఏపీలోని ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలన్నీ కలిసి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అంతేకాకుండా సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీని కలిసిన ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా వైఎస్సార్ పీటీడీ ఉద్యోగుల…
ఏపీలో పీఆర్సీపై స్పష్టత రావడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అయితే ఉద్యోగ సంఘాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఇప్పటికే పలు మార్లు ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను కోరింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.…
ఏపీలో కొత్త పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగసంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితి గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యాయి. అంతేకాకుండా పీఆర్సీపై స్పష్టత లేదని, పీఆర్సీ పై స్పష్టత వచ్చే వరకు జనవరి నెల నుంచి ప్రభుత్వం అమలు చేస్తానన్న కొత్త జీతాలకు బదులు పాత జీతాలే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే ఏపీ ప్రభుత్వం…
ఏపీలో పీఆర్సీపై స్పష్టత రావడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అయితే ఉద్యోగసంఘాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే పలుమార్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను పీఆర్సీపై చర్చలకు రావాలని ఆహ్వానించింది. అయితే ఇప్పటివరకు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు మంత్రుల కమిటీతో…
ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఆర్సీపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఎస్మా ప్రయోగించే అంశంపై ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామంటూ స్పష్టం చేయడంతో అలెర్టయింది ప్రభుత్వం. సమ్మె దిశగా అడుగులేస్తోన్న ఆర్టీసీ, విద్యుత్, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ఎలాగైనా దారికి తీసుకురావాలని భావిస్తోంది. ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తోన్న…