Home
Ap Politics
Ap Politics News
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆగస్టు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలపరచడం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను నిర్ణయించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 17న సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయనకు విశాఖపట్నంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. ఆగస్టు 18న ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని… -
OTR: రూట్ మారిందా మేస్టారూ…?
ఆ ఎమ్మెల్సీ గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తున్నారా? ఓట్లు వేసి గెలిపించిన వర్గాన్ని గాలికొదిలేసి తన దారి తాను చూసుకుంటున్నారా? మరోసారి వాళ్ళెవరూ తనకు ఓట్లు వేయరన్న క్లారిటీతోనే సార్… సరికొత్త నిర్ణయాల వైపు అడుగులేస్తున్నారన్నది నిజమేనా? గద్దనెక్కాక గమ్యాన్ని మర్చిపోయారంటున్న ఆ శాసన మండలి సభ్యుడు ఎవరు? నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఏ వర్గం గుర్రుగా ఉంది? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మూడు సార్లు గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.… -
OTR: ఈ.. నటన ఏదైతే ఉందో…!
కోనసీమ వైసీపీలో కనిపిస్తోందంతా నిజమేనా? లేక లోకల్ నాయకులు చేస్తున్న కనికట్టా? నిన్నటిదాకా ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడని వాళ్లు ఇప్పుడు మాత్రం… భుజం భుజం రాసుకుని తిరగడం వెనకున్న కారణం ఏంటి? మార్పు మంచిదే అయినా… అది బలవంతమా? స్వచ్చందమా? ప్లాస్టిక్ నవ్వులు, పై పూత కోటింగ్లన్న డౌట్ సొంత కేడర్కే ఎందుకు వస్తోంది? డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ నేతలు ఒక్కతాటిపైకి వచ్చినట్టు కనిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతర్గత… -
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
శ్రీకాకుళం జిల్లా సబ్ జైలులో 23 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజుకు నేడు బెయిల్ మంజూరైంది. బెయిల్పై జైలు నుండి విడుదలైన ఆయనకు కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికి ఆనందం వ్యక్తం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రజాపోరాటాలు చేయడం సహజమని, కానీ తమపై రాజకీయ కక్ష… -
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలువుతున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, జైలుకు పంపిన తీరు రాష్ట్రంలో బాధితులే నిందితులుగా మారుతున్న దారుణ పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ, చివరకు ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ధ్వంసం చేసి అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్రల పాలన సాగుతోందని జగన్… -
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
విజయనగరంలో సీనియర్ వైఎస్సార్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని, దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రిని పదవి నుంచి పక్కన పెట్టాలని స్పష్టం చేశారు. యువత, నిరుద్యోగులు తమ సమస్యలపై గత డెబ్బై రోజులకు పైగా పోరాటం చేస్తున్నారని, వారు ర్యాలీలు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. వెనక్కి వెళ్తామన్నా… -
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
Perni Nani: రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. డీఎస్సీ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. విజయవాడలో నిరసనకారులపై దాడులు జరిగాయని, దీక్షా శిబిరంపై నేరుగా దాడి చేశారని, మహిళలపై దాడులు జరిగినా పోలీసులు స్పందించలేదని విమర్శించారు. మల్లాది విష్ణుపై దాడి జరిగినప్పటికీ బాధితుడినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. డీఎస్సీలో జరిగిన… -
YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసుల అరాచకాలు ప్రజాస్వామ్యాన్నే హాస్యాస్పదం చేస్తున్నాయని.. అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడితే వారికి రక్షణ కల్పిస్తూ, దాడికి గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించడం ఏ రకమైన న్యాయం? ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా నిలబడితే వారిపై కూడా కేసులు పెడుతూ, ప్రశ్నించిన వారి తలుపులు అర్ధరాత్రి బద్దలుకొట్టి అరెస్టులు చేయడం పోలీసు రాజ్యానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్… -
YSRCP: ముదురుతోన్న డీఎస్సీ వివాదం.. ఉద్యమ బాటలో వైసీపీ.. కార్యాచరణ ప్రకటన
YSRCP: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాలపై వివాదం కొనసాగతూనే ఉంది.. విమర్శలు, ఆరోపణలు, సవాళ్ల పర్వం కొనసాగుతుంగా.. డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పలు దశల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 31న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అనంతరం ఆగస్టు 3, 4… -
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
Off The Record: మంత్రులకు చెక్ పెట్టేందుకు రెండు జిల్లాల ఎమ్మెల్యేలు ఏకమయ్యారా? తమ ఏరియాల్లో వాళ్ళ పెత్తనాలు చెల్లకుండా పర్ఫెక్ట్ స్కెచ్ వేశారా? మంత్రుల పర్యటనలో కనిపించకుండా, తమ అనుచరులు రాకుండా పకడ్బందీ ప్రణాళిక ప్రకారం వాళ్ళని అవమానిస్తున్నారా? ఏపీ మంత్రులు ఎవరికి, ఎక్కడ అలాంటి అవమానాలు జరుగుతున్నాయి? ఏ జిల్లా ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ చేస్తున్నారు?. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అయిన మరో మినిస్టర్…
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
-
OTR: జడ్చర్ల రాజకీయాల్లో రచ్చ.. ఈ పబ్లిసిటీ స్టంట్ వెనుక ఎవరున్నారు..?
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!