AP Home Minister Anitha Health Update: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితకు స్వల్ప అస్వస్థత కలగడంతో ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీపీ హెచ్చుతగ్గులు కనిపించడంతో సిబ్బంది జాగ్రత్త చర్యగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. హోం మంత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవలి రోజులుగా తీవ్ర పని ఒత్తిడి ఉండటంతో అలసట కారణంగా ఈ అస్వస్థత ఏర్పడినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.…
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలను మార్చి 7 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే పొడిగించాలని కూడా నిర్ణయించారు. మొత్తం 17 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు…
CM Chandrababu: గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ కనూరి- జింఖానా తల్లి మరియు శిశు ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మంచి కార్యక్రమానికి సహకరించిన జింఖానా సభ్యులు, ఎన్నారైలకు ధన్యవాదాలు.. సమాజంలో మంచి మిగిలి ఉందనడానికి మీరు ఉదాహరణ.. జింఖానా సభ్యులందరిని అభినందిస్తున్నా.. మనం బాగుంటేనే చాలదు... చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి.
Kethireddy Venkatarami Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కోడిని కోసినా కేసులు పెట్టే పరిస్థితి నెలకొందని, ఈ విధమైన పాలనతో కూటమికి వినాశనం తప్పదని ఆయన హెచ్చరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లు గడిచినా రాష్ట్ర పరిస్థితి మారలేదని అన్నారు. ప్రభుత్వం ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తోందని ఆరోపించారు. రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని…
CM Chandrababu: నగరి పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 2024కు ముందు రాష్ట్రం పూర్తిగా అతలాకుతలం అయిందన్న ఆయన.. నోటీసులు కూడా ఇవ్వకుండా తనను రాత్రికి రాత్రే అరెస్టు చేశారని, గత ఐదేళ్లుగా కనీసం మాట్లాడాలన్నా, నవ్వాలన్నా వీలుకాని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత భయంకరమైన పాలన ఐదేళ్లపాటు కొనసాగిందని ఆయన విమర్శించారు. Read Also: Nihilist Penguin: ఈ పెంగ్విన్ స్టోరీ మీమ్ కాదు.. మైండ్…
YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వేకు సంబంధించిన క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సమగ్ర భూ సర్వే చేశారా?అంటూ ప్రశ్నించారు. భూముల రీ సర్వే కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించామని.. అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన…
Gunda Appala Suryanarayana Passes Away: ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అలియాస్ గుండ సూర్యనారాయణ కన్నుమూశారు. ఇంటిలో కాలుజారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలవ్వగా, గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను…
Nara Lokesh: అందరికీ పార్టీనే సుప్రీం.. పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని మంత్రి నారా లోకేష్ టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లను ఆదేశించారు.
Undavalli Arun Kumar: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు సీనియర్ పొలిటీషన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని హితవు చెప్పిన ఆయన.. పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. సీఎం అవుతాడని నేను నమ్మిన పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అన్నారు ఉండవల్లి..…
Ambati Rambabu: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారు.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు?.. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని ప్రశ్నించారు.