CM Chandrababu: 100 ఎకరాల్లోనే కాదు, మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో కూడా సెక్రటేరియట్ కట్టొచ్చు..
- అమరావతిలో 100 ఎకరాల్లో సెక్రటేరియట్ కడితే సరిపోతుందని కొందరు అంటున్నారు..
- 100 ఎకరాల్లోనే కాదు, మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో కూడా సెక్రటేరియట్ కట్టొచ్చు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ కనూరి- జింఖానా తల్లి మరియు శిశు ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మంచి కార్యక్రమానికి సహకరించిన జింఖానా సభ్యులు, ఎన్నారైలకు ధన్యవాదాలు.. సమాజంలో మంచి మిగిలి ఉందనడానికి మీరు ఉదాహరణ.. జింఖానా సభ్యులందరిని అభినందిస్తున్నా.. మనం బాగుంటేనే చాలదు… చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి.. భారతదేశంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు ఏ దేశంలో లేవు.. పిల్లలు ఎంత పెద్ద వారైనా తల్లిదండ్రులకు జీవితాంతం తోడుగా ఉండేది మన దేశంలోనే.. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణంతోపాటు నిర్వహణకు ఫండ్ ఏర్పాటు చెయ్యడం గొప్ప విషయం.. నాట్కో ఫార్మా జీజీహెచ్ కు తనవంతు సేవ చేస్తుంది.. కేంద్రం కూడా పీపీపీ మోడల్ అవలంభిస్తుంది.. వేగంగా అభివృద్ధి చెందడానికి పీపీపీ మోడల్ లో పనులు చేస్తున్నారు.. పీ4 ద్వారా సమాజంలో పేదలకు సాయం చేసేలా ప్రోత్సహిస్తున్నాం.. చదువు గేమ్ ఛేంజర్.. అంబేద్కర్ చదువుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడా సాయం చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు.
Read Also: Paul Stirling History: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. టీ20 చరిత్రలో పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర!
Also Read
అయితే, ఆర్థిక అసమానతలు తగ్గించడమే కాకుండా పేదరికం నిర్మూలించడానికి 22లక్షల కుటుంబాలకు సాయం అవసరం అని సీఎం చంద్రబాబు అన్నారు. పీ4లక్ష్యం కూడా పేదరిక నిర్మూలనే.. ఎంసీహెచ్ బ్లాక్ కు ప్రభుత్వపరంగా అండగా ఉంటాం.. డబ్బు సద్వినియోగం చేసినప్పుడే సంతృప్తి వస్తుంది.. మన సంపాదనలో కొంతభాగం సమాజానికి సేవ చేసేందుకు ఉపయోగిస్తే సంతృప్తి ఉంటుంది.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదే.. 2038కల్లా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.. అమరావతి లాంటి ఫ్యూచర్ సిటీల అవసరం ఎంతో ఉంది.. నాలెడ్జ్, ఎకానమీకి తెలుగు రాష్ట్రాలు కేరాఫ్ గా ఉండాలి.. జాతికి గుర్తింపు ఉండాలంటే మంచి రాజధాని కావాలి.. క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా అమరావతి మారుతుంది.. పవర్ సెక్టార్ లో సంస్కరణలు తీసుకొచ్చి కరెంట్ కొరత లేకుండా చేశామన్నారు. 15 ఏళ్లలో అమరావతి రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
-
Vitamin Deficiency: రాత్రంతా నిద్రపోయినా అలసటగా ఉందా? మీ శరీరంలో ఈ సమస్య ఉండొచ్చు.
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!