Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Was The Ship Seized Has The Ration Mafia Been Stopped Ambati Rambabu Questions Government

Ambati Rambabu: షిప్‌ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?

Published Date :December 5, 2025 , 6:41 pm
By Chandra Shekhar Pamena
  • పోలవరాన్ని సర్వనాశనం చేశారు.. బ్యారేజికే పరిమితమైంది..
  • పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే నిర్మిస్తే డబ్బులు రావని వదిలేశారు..
  • షిప్‌ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?: అంబటి రాంబాబు
Ambati Rambabu: షిప్‌ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ambati Rambabu: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారు.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు?.. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని ప్రశ్నించారు. అమరావతిది అంతులేని కథ.. పోలవరం ది ముగింపు లేని కథగా మార్చారని ఆరోపించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలాగా వాడుకుంటున్నారు.. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది.. కానీ, డబ్బులు కొట్టేయటానికి ఆ ప్రాజెక్టును ఏపీకి బదలాయించుకున్నారు.. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్‌ కట్టారు.. అది కొట్టుకు పోవటంతో వెయ్యి కోట్ల నష్టం జరిగిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Read Also: Nishant Kumar: రాజకీయాల్లోకి సీఎం కొడుకు..

Also Read

  • Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
  • Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
  • Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
  • Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం

అయితే, స్పిల్ వే నిర్మిస్తే డబ్బులు రావని దాన్ని వదిలేశారు.. జగన్ హయాంలోనే స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేశారని మాజీ మంత్రి అంబటి అన్నారు. 2013-14 రేట్ల ప్రకారం పోలవరం కడతానని చంద్రబాబు చెప్పారు.. కానీ, అది పూర్తి కాదని జగన్ కేంద్రంతో మాట్లాడి 2017-18 ధరల ప్రకారం నిర్మాణానికి అంగీకరించేలా చేశారు.. తొలిదశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది.. ఎన్నికలకు ముందు చంద్రబాబు కుట్ర పన్నినప్పుడు ఆ నిధులు రాకుండా చేశారు.. మొదటి దశకే 41.5 కు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేశారు.. రెండోదశ అయిన 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మాణం జరగటం లేదు.. అది పూర్తయితేనే ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుంది.. పోలవరాన్ని ఇప్పుడు బ్యారేజీకే పరిమితం చేశారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై కేంద్రం ఆగ్రహం.. ప్రయాణికులకు రీఫండ్ చెల్లించాలి

ఇక, జగన్ కొన్ని వేల స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేశారని వైసీపీ నేత రాంబాబు పేర్కొన్నారు. జగన్ ఇచ్చిన బెంచీల మీద కూర్చుని చంద్రబాబు విమర్శించారు.. సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినా, అందులో పెట్టినవన్నీ జగన్ ఇచ్చిన బెంచీలు, కుర్చీలే.. లోకేష్ విద్యా శాఖామంత్రిగా ఏ పనీ చేయలేదు.. హోంమంత్రి అనిత చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారాంతంలో ఎక్కడ ఉంటున్నారు? అని ప్రశ్నించారు. అసలు వీరికి హెడ్ క్వార్టర్ ఏది?.. చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు?.. హైదరాబాదులోని ఇంట్లోకి పవన్ కి తప్ప మరెవరికీ ప్రవేశం లేదు.. ధాన్యం కొనుగోలు చేయటం చేతగాని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా జగన్ ని విమర్శిస్తున్నాడు.. రేషన్ బియ్యంలో కమీషన్లు దండు కుంటున్నారు.. షిప్‌ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా? అని అంబటి రాంబాబు అడిగారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ambati Rambabu
  • Ambati Rambabu statements
  • Andhra Pradesh ration scam
  • AP politics news
  • government criticism AP

తాజావార్తలు

  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..

  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!

  • Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?

  • Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions