ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్ కరోనా టెస్ట్ ధరను తాజాగా ప్రభుత్వం సవరించింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే ఆర్టీపీసీఆర్ శాంపిళ్లను పరీక్షించేందుకు ఒక్కో టెస్టుకు రూ.475, అలాగే ఎన్ఏబీఎల్ ల్యాబ్లలో అయితే రూ.499 వసూలుచేస్తున్నారు. ఇప్పుడు దానిని రూ.350గా నిర్ణయించారు. ఈ మేరకు ఆస్పత్రులు, ల్యాబ్లలో తప్పనిసరిగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ…
పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీఎంవోతో అధికారులు చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏను తగ్గించడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టనున్నారు. పీఆర్సీ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏలను భారీగా తగ్గించడంపై సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి. పీఆర్సీ జీవోలన్ని ఉద్యోగులకు నష్టం కలిగించేలా ఉన్నాయని బండి వెంకట్రామిరెడ్డి అన్నారు. Read Also: తెలంగాణ ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి.. రూ.107 కోట్ల ఆదాయం…
చింతామణి నాటకంపై నిషేధం విధించింది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం… చింతామణి నాటకం ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా ఉందంటూ.. నాటక ప్రదర్శనను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆర్యవైశ్యులు.. దీంతో.. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఎక్కడా చింతామని నాటకాన్ని నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.. ఇక, చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల హర్షంవ్యక్తం చేశారు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య…
ప్రముఖ హేతువాద ఉద్యమ నేత, కవి త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లాలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. త్రిపురనేని కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారు. విశాల భావాలతో రామస్వామి నాటి సమాజం పై చెరగని ముద్ర వేశారు. సంఘసంస్కరణ కర్తగా సమాజంలో మార్పును ఆకాంక్షించారు రామస్వామి చౌదరి. తన కలంతో ఎంతోమందిని కదిలించేలా చేశారు.ఇతరులను ప్రశ్నించటం సులభం. కాని తనను తాను…
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కేసులు భారీ సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైనా మొత్తం కేసుల సంఖ్య 20,93,860 కు చేరింది. ఇందులో 20,61,039 మంది కోరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 14,508 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,313 గా ఉంది. కాగా గడిచిన 24 గంటల్లో 418 మంది కోవిడ్ మహమ్మారి…
ఏపీ ఉద్యోగుల HRA పెంపు వ్యవహారం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా జేఏసీల ఐక్యవేదిక ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మరోసారి సీఎంఓ అధికారులతో సమావేశం అయిన ఉద్యోగ సంఘాల నేతలు. సీఎస్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతృప్తి చెందడం లేదు. సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే అమరావతి పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల హెచ్ఆర్ఏ 30 శాతం నుంచి 8 శాతానికి…
గత ప్రభుత్వ హయాంలో జిల్లా హెడ్ క్వార్టర్ల వారీగా సాధించుకున్న హెచ్ఆర్ఏ శ్లాబ్లను సైతం ఇప్పుడు మార్చేయడం దారుణమని ఉద్యోగ సంఘాల జేఏసీల ఐక్య వేదిక నాయకులు పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు HRA ఖరారు పై ఇవాళ రెండు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సీఎస్ కమిటీ సిఫార్సులను అమలుచేస్తామని చెబుతుందన్నారు. Read Also: డేంజర్ బెల్స్..…
ఏపీ ప్రభుత్వం 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయగా…. ప్రజాభిప్రాయ సేకరణలో చుక్కెదురైంది. బుధవారం నాడు తుళ్లూరు మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. ఈ సందర్భంగా 16 గ్రామాలు అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఇప్పటికే ఈ విషయంపై పలుచోట్ల అధికారులు గ్రామ సభలు నిర్వహించగా ఈరోజు ఆఖరి గ్రామ సభను తుళ్లూరులో నిర్వహించారు. 2014లో సీఆర్డీఏ చట్టంలోని 29 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్కు తాము అనుకూలమని…
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అయితే తాజాగా ఈ తేదీలను ప్రభుత్వం మార్చింది. ఇదివరకు ప్రకటించిన సెలవులకు బదులుగా ఈనెల 13(గురువారం), 14(శుక్రవారం), 15(శనివారం) తేదీల్లో సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 13, 14, 15 తేదీల్లోనే…