ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: బండి శ్రీనివాస్, ఏపీ జేఏసీ ఛైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ జేఎసీ, ఏపీజేఎసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం , సచివాలయ ఉద్యోగుల సంఘాలు ఏక తాటిపైకి రావాలని నిర్ణయించినట్టు బండి ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చర్చల ద్వారా సంప్రదింపులు చేసుకుని ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించుకున్నామన్నారు. పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల ద్వారా నష్టం జరుగుతుందన్నారు. ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మా డిమాండ్లు సాధించుకుంటామన్నారు. సచివాలయంలో రేపు ఉదయం 11.30 గంటలకు సమావేశ అనంతరం విధి విధానాలు వెల్లడిస్తామన్నారు.
పీఆర్సీ పై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు: సూర్యనారాయణ,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత
పీఆర్సీ పై ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ అన్నారు. గంభీర పరిస్థితిని అర్థం చేసుకుని కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. పర్సనల్ అజెండా, అంతర్గత విభేధాలను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు.ఒకే తాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని డిసైడ్ అయ్యాం. మా పోరాటం చరిత్రలో లిఖించేందుకు కారణమవుతుంది. రేపటి నుంచి అందరిదీ ఒకటే మాట, ఒకే వాదన, ఒకటే డిమాండ్ ఉంటుందన్నారు.
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
Read Also: రింగు వలలపై కొలిక్కి రాని చర్చలు
ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలను పరిష్కరించాలి: వెంకట్రామిరెడ్డి
ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలను పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అందరి సమస్య ఒకటే కాబట్టి ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడి డిమాండ్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యమై ఒకే వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించాం. మెరుగైన పీఆర్సీ కోసం కలసి పోరాడనున్నట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు. రేపు సచివాలయంలో సమావేశమై తదుపరి కార్యాచరణ రేపు ప్రకటిస్తామని తెలిపారు.
నలుగురం ఏకాభిప్రాయానికి వచ్చాం: బొప్పరాజు, ఏపీ జేఎసీ అమరావతి ఛైర్మన్
సచివాలయంలోని కార్యాలయంలో రేపు అన్ని డిమాండ్లపై చర్చించనున్నట్టు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు తెలిపారు. మెరుగైన పీఆర్సీ సహా ఎలాంటి డిమాండ్లు పెట్టాలనే అంశంపై చర్చిస్తామన్నారు. సమావేశంలో జరిగిన చర్చలను మా జేఏసీ సమావేశంలో తెలియజేస్తామన్నారు. ఇప్పటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మా జేఎసీల ఐక్యవేదికలతో అందరితో చర్చిస్తాం. రేపు సీఎస్కు సమ్మె నోటీసు ఇస్తాం. సమ్మె నోటీసు పై వెనక్కి తగ్గేది లేదు. అందరం కలిసి రేపు ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని బొప్పరాజు తెలిపారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!