ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పేర్ని నానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయన్నారు. సినిమా టిక్కెట్ రేట్లపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పానని… ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు రామ్గోపాల్ వర్మ తెలిపారు. Read Also: ప్రభాస్… హాలీవుడ్ హీరో అనిపించుకుంటాడా? సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే సినిమా క్వాలిటీ…
ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష ముగిసింది.సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో పీఆర్సీ పై చర్చించారు. ఉద్యోగ సంఘాలతో చేసిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా పలు డిమాండ్ల పరిష్కారంపై అధికారులతో సీఎం చర్చించారు. ఉద్యోగులకు ఎంతమేర ఫిట్మెంట్ ఇవ్వాలనే అంశంపై సీఎం సమాలోచనలు జరిపారు. Read Also:కస్టమ్స్ సుంకం ఎగవేసిన షావోమి.. కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు ఎంత శాతం…
ఏపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర విభజన కంటే వైఎస్ జగన్ చేసిన డామేజ్ నుంచి రాష్ట్రం కోలుకోవడం చాలా కష్టం అన్నారు.. కరోనా వైరస్కి మందుందేమో కానీ.. జగన్ వైరస్కి మందు లేదని మండిపడ్డారు.. ఏపీ అప్పు రూ. 7 లక్షల కోట్లకు చేరిందన్న బాబు.. ఉద్యోగులకు చరిత్రలో ఎవ్వరూ ఇవ్వనంత ఫిట్మెంట్ టీడీపీనే ఇచ్చిందన్నారు.. చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా కొనసాగుతోన్న పీఆర్సీ ఎపిసోడ్ క్లైమాక్స్కి చేరినట్టుగా తెలుస్తోంది.. ఆందోళనకు దిగిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వ విజ్ఞప్తితో మళ్లీ విధుల్లోకి హాజరయ్యారు.. కానీ, ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీపై ప్రకటన మాత్రం రాలేదు.. చర్చలు కొనసాగుతూనే ఉన్నా.. ప్రకటన రాకపోవడంతో.. మళ్లీ ఉద్యమానికి సిద్ధం అయ్యారు ఉద్యోగులు.. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. పీఆర్సీ ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరినట్టు తెలుస్తోంది.. ఉద్యోగులకు సంక్రాంతి కానుగా పీఆర్సీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.…
ప్రభుత్వం అంటే సవాలక్ష ఖర్చులు ఉంటాయి.. ఓవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు ప్రాజెక్టులు, ఇంకోవైపు జీతాలు, పెన్షన్లు.. అబ్బో ఒక్కటేంటి.. అదో పెద్ద మహాసముద్రమే.. అయితే, ఆర్థికంగా బాగా ఉన్న రాష్ట్రాలతో పాటు, పెద్ద రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవయమే ఎక్కువని తేల్చింది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్).. ఉద్యోగుల జీతభత్యాలపై ఏపీ సర్కార్ కంటే.. మిగతా రాష్ట్రాలు తక్కువగా ఖర్చు చేస్తున్నాయని కాగ్ పేర్కొంది.. 2021–2022 తొలి ఏడు నెలల గణాంకాలను అంటే…
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ పర్యటన నేటితో ముగిసింది. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ధర్మేంధ్ర ప్రధాన్లతో సమావేశమైన సీఎం వైయస్.జగన్ రాష్ర్టంలో నెలకొన్న సమస్యలు, విభజన హామీల అమలుపై కేంద్ర మంత్రులతో చర్చించారు. సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకున్న సీఎం జగన్. ఉదయం కేంద్ర మంత్రి నితిన గడ్కరీతో సమావేశం తర్వాత కేంద్ర సమాచార ప్రసార, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో సమావేశమయ్యారు. ఆర్బీకేలద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని…
ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2ను ప్రవేశపెట్టింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఈ జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసింది. అయితే దీనిపై మరోసారి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.…
టాలీవుడ్ లో ప్రస్తుతం ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలువురు ప్రముఖులు ఈ విషయమై తమ స్పందన తెలియజేస్తున్నారు. మరికొంతమంది మౌనం వహిస్తున్నారు. దీంతో ఈ విషయమై మాట్లాడే పెద్ద దిక్కు ఎవరు లేరా..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయమై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. సినిమా టికెట్ల ధరల అంశంపై ఆర్జీవీ అడిగిన ప్రశ్నలు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో… కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 165 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77, 486 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 497 కి…
గత కొంత కాలంగా ఏపీలో సినిమా టిక్కెట్ల రగడ మాములుగా జరగడం లేదు. దీంతో ఈ మధ్య కాలంలో నిర్మాతల మండలి మంత్రి పేర్ని నానితో సమావేశయ్యారు. దీంతో ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. తప్ప ఇండస్ట్రీ వర్గాలకు ఊరట లభించలేదు. దీంతో ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండను అని అన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఆ మాటలు అన్న వెంటనే మోహన్ బాబు నేను ఏపీ ప్రభుత్వాన్ని కి…